మెగాస్టార్ చిరంజీవి, రామ్చరణ్ కలిసి సంయుక్తంగా నటించిన ఆచార్య సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎప్పట్నించో ఊరిస్తున్న వస్తున్న సినిమా కావడం తో అంతటా ఆసక్తి పెరిగింది. భారీ అంచనాల నడుము రిలీజ్ అయినా ఈ మూవీ యావరేజ్ టాక్ దక్కించుకుంది. కొరటాల కథలో దమ్ము లేకపోవడం , స్క్రీన్ ప్లే కూడా ఆకట్టుకోలేకపోవడం, మ్యూజిక్ పెద్దగా లేకపోవడంతో ప్రేక్షకులు పెదవి విసురుతున్నారు. ఇదిలా ఉంటె ఈ మూవీ ఓటిటి రిలీజ్ డేట్ ఇదే అంటూ ఓ వార్త వైరల్ గా మారింది.
ఆచార్య’ మూవీ హక్కులను కొనుగోలు చేసిన అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ.. ఈ సినిమాను నెల రోజుల తర్వాత స్ట్రీమింగ్ చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుందని తాజాగా ఓ న్యూస్ కూడా లీకైంది. అంటే.. ఆచార్య ఏప్రిల్ 29న విడుదలైంది. కాబట్టి దీన్ని మే 29న లేదా 30వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ప్రస్తుతం సినిమా కు యావరేజ్ , ప్లాప్ టాక్ రావడం తో అంతకంటే ముందే వచ్చిన ఆశ్చర్య పోనవసరం లేదు. ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించాయి. పూజా హెగ్డే హీరోయిన్గా చేసింది. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించాడు. సోనూ సూద్ ఇందులో విలన్ పాత్రను పోషించారు.