Homeటాప్ స్టోరీస్ఆచార్య నుండి ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించే అప్డేట్

ఆచార్య నుండి ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించే అప్డేట్

ఆచార్య నుండి ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించే అప్డేట్
మరి ఆచార్య విడుదలయ్యేది ఎప్పుడు?

మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ కలయికలో తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో నటిస్తుండడం తో ఈ మూవీ ఫై భారీ అంచానాలు నెలకొని ఉన్నాయి. ప్రస్తుతం షూటింగ్ అంత పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 29 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో నిర్మాత అన్వేష్ రెడ్డి సినిమాలోని హైలైట్ సన్నివేశాన్ని బయటకు తెలిపి.. అభిమానుల్లో పూనకాలు పుట్టించారు.

తండ్రీ కొడుకులు కలిసి దాదాపు 25 నిమిషాల స్క్రీన్ టైమ్ తో అభిమానులకు స్పెషల్ ట్రీట్ ఇవ్వబోతున్నారని వెల్లడించారు. వాస్తవానికి చిరు-చరణ్ వ్యక్తిగతంగా సినిమా అంతటా అనేక సన్నివేశాలను కలిగి ఉన్నారు. అయితే సుమారు 20 నుండి 25 నిమిషాల పాటు ఆ ఇద్దరూ కలిసి స్క్రీన్ ను పంచుకుంటారు అని అన్వేష్ రెడ్డి ధృవీకరించారు. ఇక ఈ సినిమాని మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్ తో కలిసి కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై నిరంజన్రెడ్డి- అన్వేష్రెడ్డి నిర్మిస్తున్నారు. సోనూ సూద్, జిషు సేన్ గుప్తా, వెన్నెల కిషోర్, పోసాని కృష్ణ మురళి, తనికెళ్ల భరణి, అజయ్, బెనర్జీ కీలక పాత్రల్లో నటిస్తుండగా మణిశర్మ సంగీతం అందించారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All