ఇక పై విలన్ పాత్రలు అలాగే సైడ్ క్యారెక్టర్ లు చేసేది లేదని హీరోగా మాత్రమే నటిస్తానని సంచలన విర్ణయం తీసుకున్నాడు యువ నటుడు ఆది పినిశెట్టి . దర్శకులు రవిరాజా పినిశెట్టి తనయుడైన ఆది పినిశెట్టి తేజ దర్శకత్వంలో వచ్చిన ఒక విచిత్రం చిత్రంతో హీరోగా పరిచయం అయ్యాడు అయితే ఆ సినిమా ఘోర పరాజయం పొందడంతో తెలుగు బాట ని వదిలేసి తమిళ చిత్రాల్లో ప్రయత్నించాడు అక్కడ హీరోగా సక్సెస్ అయ్యాడు .
అయితే మన తెలుగులో మాత్రం ఆది పినిశెట్టి కి విలన్ పాత్రలు , సైడ్ క్యారెక్టర్ లు ఇస్తున్నారు అయినప్పటికీ అవి చేసుకుంటూ వస్తున్నాడు ఆది అయితే తాజాగా మాత్రం ఓ సంచలన నిర్ణయం తీసుకున్నాడు ఇకపై విలన్ పాత్రలు సైడ్ పాత్రలు వస్తే చేయకూడదని హీరోగా మాత్రమే నటిస్తానని అంటున్నాడట . ఇటీవలే విడుదలైన రంగస్థలం చిత్రంలో ఆది పినిశెట్టి నటనకు మంచి ప్రశంసలు దక్కుతున్నాయి .
- Advertisement -