Homeఎక్స్ క్లూసివ్పవన్ కళ్యాణ్ పై 60 కోట్ల పరువు నష్టం

పవన్ కళ్యాణ్ పై 60 కోట్ల పరువు నష్టం

60 crores defamation ceses on pawan kalyan పవన్ కళ్యాణ్ పై 60 కోట్లకు పరువు నష్టం దావా వేశారు టివి 9 అధినేత శ్రీని రాజు , ఏబీఎన్ రాధాకృష్ణ లు . నిన్న సాయంత్రం పవన్ కళ్యాణ్ టివి 9 ని, ఏబీఎన్ ని , టివి 5 ని బాయ్ కాట్ చేయాలనీ ఆ ఛానళ్ల ను మెగా అభిమానులు చూడొద్దని పవన్ కళ్యాణ్ ఆదేశించిన విషయం తెలిసిందే . తెలుగుదేశం పార్టీ కి వత్తాసు గా ఉన్న ఈ చానళ్ళు మెగా కుటుంబాన్ని అందునా నన్ను టార్గెట్ చేశాయని అందుకే వాటిని చూడొద్దని పవన్ ట్వీట్ చేసాడు .

దాంతో సదరు మీడియా చానళ్ళు పవన్ కళ్యాణ్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు . పవన్ కళ్యాణ్ పై కోపంగా ఉన్న సదరు ఛానళ్ల యజమానులు 60 కోట్ల పరువు నష్టానికి దావా వేసాయి . టివి 9 అధినేత శ్రీనిరాజు 50 కోట్ల పరువు నష్టం దాఖలు చేయగా ఏబీఎన్ రాధాకృష్ణ మాత్రం 10 కోట్లకు పరువు నష్టం దావా వేసాడు . ఈ రెండు దావా ల వల్ల పవన్ కళ్యాణ్ కు కొంత ఇబ్బందే ! అయితే రాజకీయంగా పవన్ వీటిని ఎలా ఎదుర్కొంటాడో చూడాలి .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All