Homeటాప్ స్టోరీస్డేంజర్ జోన్ లో 39 మంది ఎం ఎల్ ఏ లు

డేంజర్ జోన్ లో 39 మంది ఎం ఎల్ ఏ లు

39 TRS MLAs in danger zone అధికార టీఆర్ ఎస్ పార్టీ కి చెందిన 39 మంది ఎం ఎల్ ఏ లు డేంజర్ జోన్ లో ఉన్నట్లు సర్వే లో తేలడంతో అధికార పార్టీలో కలవరం మొదలయ్యింది . 2019 లో జరిగే ఎన్నికల్లో మళ్ళీ అధికారం మాదే అంటూ ఇటీవలే డంకా బజాయించి మరీ చెప్పాడు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు . ఇప్పటికే రెండుసార్లు పార్టీ పరిస్థితి పై సర్వే చేయించాడు కేసీఆర్ కాగా రైతుబంధు కార్యక్రమం తర్వాత మరోసారి సర్వే చేయించగా కేసీఆర్ కు షాకింగ్ విషయాలు తెలిశాయట !

ఇప్పుడున్న 90 మంది ఎం ఎల్ ఏ లలో 39 మంది ఎం ఎల్ ఏ లు డేంజర్ జోన్ లో ఉన్నారంటే మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవ్వడం కష్టం ! టి ఆర్ ఎస్ పార్టీ అధికార పీఠానికి దూరం అవ్వడం ఖాయం , అందుకే సర్వే రిపోర్ట్ ని బయటకు పొక్కకుండా జాగ్రత్త పడ్డారట ! కానీ అప్పటికే లీక్ అయిపోవడం జరిగింది అంతేకాదు డేంజర్ జోన్ లో ఉన్న 39 మంది ఎం ఎల్ ఏ లకు క్లాస్ తీసుకున్నారట కేసీఆర్ . మీ పనితీరు మెరుగు పరుచుకోకపొతే వచ్చే ఎన్నికల్లో గెలవడం కష్టం అని కొంతమంది కి ముఖం మీదే చెప్పాడట ! దాంతో గులాబీ శ్రేణుల్లో ఆందోళన మొదలయ్యింది . ఎన్నికలకు ఇంకా 10 నెలల సమయం మాత్రమే ఉంది దాంతో అధికార పార్టీ కి చెమటలు పడుతున్నాయి . ఒకవైపు కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకి బలోపేతం అవుతుండటంతో వచ్చే ఎన్నికలు మహాసంగ్రామం ని తలపించేలా ఉన్నాయి .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All