Homeటాప్ స్టోరీస్భీమ్లా నాయక్ ఫై వైసీపీ నేత ప్రశంసలు

భీమ్లా నాయక్ ఫై వైసీపీ నేత ప్రశంసలు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ ఫై సినీ నటుడు , వైసీపీ నేత పృథ్వీరాజ్ ప్రసంశలు కురిపించారు. పవన్ కళ్యాణ్, రానా కలయికలో సాగర్ కె చంద్ర డైరెక్షన్లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ భీమ్లా నాయక్ ..శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకుంది. భారీ అంచనాల నడుమ రిలీజ్ అవ్వడం..ఆ అంచనాలకు తగ్గట్లే సినిమా ఉండడం తో బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురుస్తుంది. మరోపక్క సినిమా చూసిన సినీ ప్రముఖులంతా సినిమా గురించి, పవన్ , రానా ల నటన గురించి గొప్పగా చెపుతుండడం తో సామాన్య ప్రేక్షకుల్లోనూ సినిమా చూడాలనే ఆత్రుత పెరిగిపోతుంది. ఇప్పటికే పలువురు సినీ స్టార్స్ వారి అభిప్రాయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేయగా..తాజాగా నటుడు , వైసీపీ నేత పృథ్వీరాజ్ ఓ యూట్యూబ్ ఛానల్ లో భీమ్లా మూవీ ఫై ప్రశంసలు కురిపించారు.

- Advertisement -

రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు, పవన్‌కల్యాణ్‌ అభిమానులకు నా అభినందనలు. ఇటీవలే నేను ‘భీమ్లానాయక్‌’ చిత్రాన్ని చూశాను. నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా ‘అడవి రాముడు’. ఆ సినిమా విడుదలైనప్పుడు మా తాడేపల్లిగూడెంలోని విజయాటాకీస్‌కు వెళ్తే.. భారీగా తరలివచ్చిన అభిమానుల్ని కంట్రోల్‌ చేసేందుకు పోలీసులు లాఠీచార్జ్‌ చేశారు. ఎన్టీఆర్‌ తర్వాత ఆ క్రేజ్‌ పవర్‌స్టార్‌కే చూశా. క్లైమాక్స్‌, పవర్‌స్టార్‌, రానా కాంబోలో వచ్చిన సన్నివేశాలు గొప్పగా ఉన్నాయి. ఒక ప్రేక్షకుడిలా ఈ చిత్రాన్ని ఫుల్‌ ఎంజాయ్‌ చేశా. ఈ సినిమా చూస్తున్నంతసేపు, ఒక రకమైన బాధలో ఉండిపోయాను. ఇంత అద్భుతమైన చిత్రంలో నేను నటించలేకపోయానే అని విచారంగా ఉంది. చాలా రోజుల తర్వాత పవన్‌కల్యాణ్‌ని ఇలాంటి పాత్రలో చూసి అందరి దిష్టి తగిలి ఉంటుంది. ఆయనకు అది తగలకూడదని కోరుకుంటున్నా” అని పృథ్వీరాజ్‌ అన్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All