కరోనా చేయబట్టి ఫ్యామిలీ మొత్తం వచ్చి థియేటర్ లో సినిమా చూడాలంటే భయపడిపోయే పరిస్థితి వచ్చింది. లాస్ట్ ఇయర్ మొదటి వేవ్ తర్వాత ఈ ఇయర్ మొదట్లో కొన్ని సినిమాలు సత్తా చాటగా కరోనా వేవ్ మళ్లీ విజృంభించడంతో మళ్లీ లాక్ డౌన్, థియేటర్లు మూతపడటం లాంటివి జరిగాయి. అయితే సెకండ్ వేవ్ ఎఫెక్ట్ బాగా పడటంతో థియేటర్ల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది.
థియేటర్లు నడవాలంటే టికెట్లు రేట్లు పెంచాల్సిన పరిస్థితి వచ్చిహంది. ఏపీలో ఏకంగా ప్రభుత్వమే టికెట్లు అమ్మే వెబ్ సైట్ ఏర్పాటు చేస్తుంది. ఈ క్రమంలో ఈమధ్య సినిమాలు కొన్ని రిలీజ్ అవుతున్నా సరే హౌజ్ ఫుల్ బోర్డ్ లు మాత్రం కనబడలేదని చెప్పాలి. ముఖ్యంగా యువతని సినిమాల వైపు నడిపించే సినిమాలు అంతగా రాలేదని చెప్పాలి. అయితే లేటెస్ట్ గా వచ్చిన నాగ చైతన్య, సాయి పల్లవిల లవ్ స్టోరీ మాత్రం చాలా చోట్ల హౌజ్ ఫుల్ బోర్డులు పడేలా చేసింది.
శేఖర్ కమ్ముల డైరక్షన్ లో ఫిదా తర్వాత సాయి పల్లవితో చేస్తున్న సినిమా అనో.. చైతు, సాయి పల్లవి సూపర్ జోడీ అనిపించో.. సారంగ దరియ సాంగ్ వల్లో కాని లవ్ స్టోరీకి ముందునుండి సూపర్ బజ్ ఏర్పడింది. ఒకటి రెండుసార్లు రిలీజ్ వాయిదా పడ్డా అదే బజ్ కొనసాగింది. ఫైనల్ గా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేటర్ల దగ్గర మునుపటి సందడి.. హంగామా.. విజిల్స్, కేకలు అబ్బా.. ఎంత చూడముచ్చటగా ఉందో.. నిజంగానే థియేటర్లు హౌజ్ ఫుల్ బోర్డ్ వేఏసి ఎన్నాళ్లయిందో అని అనుకుంటున్నాయి సినీ వర్గాలు.