Homeటాప్ స్టోరీస్ప్రభాస్ కోసం ప్రముఖుల మాట సాయం

ప్రభాస్ కోసం ప్రముఖుల మాట సాయం

వరుస పాన్ మూవీస్ తో అలరిస్తున్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్..ప్రస్తుతం రాధే శ్యామ్ మూవీ తో మార్చి 11 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ని యూవీ క్రియేషన్స్, టీ సిరిస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా.. రెబల్ స్టార్ కృష్ణంరాజు పరమహంస అనే ప్రత్యేకమైన పాత్ర పోషిస్తున్నారు. ఇక రిలీజ్ సమయం దగ్గర పడుతుండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్య క్రమాలపై దృష్టి సారించింది. అలాగే చిత్రంలోని విశేషాలను ఎప్పటికప్పుడు ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తూ అభిమానుల్లో ఆసక్తి నింపుతున్నారు.

- Advertisement -

పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా కోసం పాన్ ఇండియా స్టార్లందరను రంగంలోకి దింపారు మేకర్స్. ఈ సినిమా హిందీ వెర్షన్ కోసం అమితాబ్ బచ్చన్ వాయిస్ ఓవర్ ఇవ్వగా..మిగతా భాషల్లో ఎవరెవరు ఇచ్చారో తెలిపారు. తెలుగు వెర్షన్ కు దర్శక ధీరుడు రాజమౌళి తన గాత్రాన్ని అందిస్తుండగా.. కన్నడ వెర్షన్ కి శివ రాజ్ కుమార్. మలయాళ వెర్షన్ కి పృథ్విరాజ్ సుకుమారన్ వాయిస్ ఓవర్ ఇవ్వనున్నారు. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ రాధేశ్యామ్ కోసం తమ గాత్రాన్ని అందిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. వీరంతా కూడా ప్రభాస్ ఫై ప్రేమ , అభిమానంతో తన మాట సాయం చేస్తున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All