ఒకవైపు ఎన్నికల సమరంలో ఒక పార్టీపై మరో పార్టీ తీవ్ర స్థాయిలో దుమ్మెత్తిపోస్తూ తిట్ల వర్షం కురిపిస్తుంటే మెగాస్టార్ చిరంజీవి మాత్రం తనకు ఏమాత్రం పట్టనట్లుగా రాజకీయాలను , ప్రచార కార్యక్రమాలను పక్కన పెట్టి జపాన్ లో ఎంజాయ్ చేస్తున్నాడు . తన భార్య సురేఖ్ తో కలిసి వేసవి విడిది కోసం జపాన్ లోని టోక్యో కు చేరుకున్నాడు అక్కడే వివిధ ప్రాంతాలను చుట్టేస్తూ హాయిగా ఎంజాయ్ చేస్తున్నాడు చిరు .
ఏప్రిల్ 11 న ఎన్నికల పోలింగ్ ఉంది , దాంతో అన్ని రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి . ఇక చిరంజీవి విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీకి అయితే రాజీనామా చేయలేదు ఇప్పటివరకు కాబట్టి కాంగ్రెస్ లీడర్ గానే పరిగణించాలి . అయితే గతకొంత కాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నాడు చిరంజీవి . ప్రజారాజ్యం పార్టీ స్థాపించి ఘోరంగా దెబ్బతిన్న చిరు తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన విషయం తెలిసిందే . అయితే తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన అనే రాజకీయ పార్టీ ప్రారంభించగా ఆ పార్టీ నుండి పెద్ద తమ్ముడు నాగబాబు పోటీ చేస్తున్నాడు . కానీ చిరంజీవి మాత్రం ఇవేవి నాకు పట్టవు అంటూ జపాన్ వెళ్ళిపోయాడు .