సెన్సేషనల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ పోడ్ కాస్ట్ మీడియా అనే కొత్త పద్దతి ద్వారా తనకు సంబంధించిన ఆడియోలని సోషల్ మీడియాలో `లక్డికాపూల్` అంటూ పోస్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన `పరువు` అనే అంశంపై పోస్ట్ చేసిన ఆడియో ఆసక్తిని రేకెత్తిస్తోంది. స్వతహాగా పవర్ఫుల్ పంచ్ డైలాగ్లని అలవోకగా రాసే పూరి జగన్నాథ్ అంతే పదునైన మాటలతో ఈ ఆడియోని వదలడం ఆకట్టుకుంటోంది.
`ఇంట్లో వాళ్ల ఏడుపు.. ఎప్పుడూ .. నలుగురు ఏం అనుకుంటారో.. సొసైటీలో మన పరువుపోతుందో అని…సొసైటీ అంటే ఎవరు? మహాత్మా గాంధీ, రవీంద్రనాథ్ టాగూర్, అంబేద్కర్ లాంటి వాళ్లతో నిండిపోయిందా? లేదు కదా?.. మన చుట్టూ 100 మంది వుంటే అంటులో మంచి వాళ్లు ఐదుగురు కూడా వుండరు. అంటే మిగతా 95 మంది వేస్ట్ అండ్ యూజ్ లెస్. మనకంటే యెదవలు సొసైటీ నిండా ఇంత మంది వున్నప్పుడు వాళ్ల కోసమా నువ్వు బాధపడేది?..
నీ ఇంట్లో ఎలాంటి అనర్థం జరిగినా కంగారు పడాల్సిన పనిలేదు. మంచోళ్లు ఎప్పుడూ అర్థం చేసుకుంటారు. మిగతా యెదవలు అర్థం చేసుకుంటే ఏంటీ చేసుకోకపోతే ఏంటీ? `లక్డీకా పూల్. అనర్థం జరగని ఇళ్లే వుండదు. మనకు వచ్చిన ప్రాబ్లమ్ గురించి ఆలోచించాలే కానీ పరువు గురించి ఆలోచించకూడదు` అని పోడ్ కాస్ట్ మీడియా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.