![f2-venkatesh-varuntej](https://telugu.tollywood.net/wp-content/uploads/2019/04/f2-300x168.jpg)
సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ – తమన్నా , వరుణ్ తేజ్ – మెహరీన్ లు జంటగా నటించిన సంక్రాంతి బ్లాక్ బస్టర్ చిత్రం ” ఎఫ్ 2” ఈ ఉగాది రోజున బుల్లితెర పై ప్రసారం కానుంది . స్టార్ మా టివిలో ఈ సినిమాని ఉగాది రోజున అంటే ఏప్రిల్ 6 న ప్రసారం చేయనున్నామని సదరు ఛానల్ లో ప్రకటించేసారు . ఈ ఏడాది సంక్రాంతి బరిలో భారీ చిత్రాలు నాలుగు రిలీజ్ కాగా అన్ని సినిమాలని పక్కకు నెట్టేసి రికార్డుల మోత మోగించి వెంకటేష్ కెరీర్ లోనే నెంబర్ వన్ చిత్రంగా నిలిచింది ఎఫ్ 2 .
అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించాడు . ప్రపంచ వ్యాప్తంగా 180 కోట్ల గ్రాస్ వసూళ్ల ని 85 కోట్ల షేర్ ని రాబట్టి సంచలనం సృష్టించింది ఎఫ్ 2 . ఫన్ అండ్ ఫ్రస్టేషన్ అంటూ వచ్చిన ఎఫ్ 2 నవ్వుల పువ్వులు పూయించింది . కాగా ఈ చిత్రాన్ని బుల్లితెర లో వేస్తుండటంతో అందునా ఉగాది పర్వదినం రోజున వేస్తుండటంతో స్టార్ మా ఛానల్ కు మంచి రేటింగ్ రావడం ఖాయం .
- Advertisement -