కమల్హాసన్ నటిస్తున్న తాజా చిత్రం `ఇండియన్-2`. శంకర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగులో `భారతీయుడు 2` పేరుతో రిలీజ్ చేయబోతున్నారు. కాజల్ అగర్వాల్, రకుల్ప్రీత్సింగ్, సిద్ధార్థ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్పై అల్లిరాజా సుభాస్కరన్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. బుధవారం కమల్హాసన్చ కాజల్ పాల్గొనగా శంకర్ కీలక సన్నివేశాల్ని బ్లూమాట్లో చిత్రీకరిస్తున్నారు.
దీని కోసం క్రేన్ ని ఉపయోగించారు. ఆపరేటర్ అలక్ష్యం కారణంగా క్రేజ్ కూలడంతో సెట్లో వున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందడం కలకలం రేపింది. దీన్ని సిరియస్గా తీసుకున్నచెన్నై పోలీసులు చిత్ర బృందానికి సమన్లు పంపించారు. దర్శకుడు శంకర్తో పాటు హీరో కమల్హాసన్, చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్కి, ప్రొడక్షన్ మేనేజర్కి, క్రేన్ ఆపరేటర్కి సమన్లు పంపిన పోలీసులు శుక్రవారం క్రేన్ ఆపరేటర్ని అరెస్ట్ చేశారు.
షూటింగ్ సమయంలో క్రేన్ని ఆపరేట్ చేసిన రాజన్ని పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. ఆపరేటర్ అప్పమత్తరంగా లేకపోవడం వల్లే లైటింగ్ ఏర్పాటు చేస్తున్న క్రేన్ వున్నపలంగా విరిగిపడిపోవడంతో భారీ నష్టం సంభవించింది. ముగ్గురు ప్రాణాలు కోల్పోవడమే కాకుండా పది నుంచి 12 మంది గాయాలపాలయ్యారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసు శాఖ దర్యాప్తును చేపట్టి క్రేన్ ఆపరేటర్ని అరెస్ట్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.