Homeటాప్ స్టోరీస్జగన్ కుటుంబంలో విషాదం

జగన్ కుటుంబంలో విషాదం

YS Vivekananda reddy passed awayవై ఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో విషాదం నెలకొంది . వై ఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు వై ఎస్ వివేకానంద రెడ్డి (68) గుండెపోటుతో మృతి చెందాడు . ఈరోజు తెల్లవారు ఝామున వై ఎస్ వివేకానంద రెడ్డి పులివెందులలోని  స్వగృహంలో గుండెపోటుతో మూర్తి చెందాడు . వై ఎస్ రాజశేఖర్ రెడ్డి చిన్న తమ్ముడిగా వై ఎస్ రాజశేఖర్ రెడ్డి కి చేదోడు వాదోడుగా ఉన్నాడు . అలాగే రెండుసార్లు అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించిన వివేకా పార్లమెంట్ సభ్యులుగా కూడా రెండుసార్లు ఎన్నికయ్యాడు .

 

- Advertisement -

ఆ తర్వాత ఎం ఎల్ సి గా కూడా వ్యవహరించాడు , కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో వ్యవసాయ శాఖా మంత్రిగా పనిచేసాడు వివేకానంద. అయితే కొంతకాలంగా రాజకీయంగా సైలెంట్ గా ఉన్న వివేకా మళ్ళీ ఎన్నికలు రావడంతో ప్రచారంలో పాల్గొంటున్నాడు వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరుపున . బాబాయ్ చనిపోవడంతో జగన్ కుటుంబం విషాదమలో మునిగింది .

English Title : YS Vivekananda reddy passed away

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All