కీర్తిశేషులు వై ఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ గా తెరకెక్కుతున్న చిత్రం ” యాత్ర ”. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది . సినిమాని చూసిన సెన్సార్ సభ్యులు రాజశేఖర్ రెడ్డి బయోపిక్ బాగా తీశారు అని అభినందించడమే కాకుండా రాజశేఖర్ రెడ్డి పాత్రలో పరకాయ ప్రవేశం చేసాడని కితాబునిచ్చారట . ఇక ఈ సినిమాకు క్లీన్ యు సర్టిఫికెట్ ఇచ్చారు సెన్సార్ సభ్యులు.
దాంతో ఫిబ్రవరి 8న యాత్ర సినిమా విడుదలకు సిద్ధమైంది . తెలుగునాట బయోపిక్ ల హవా నడుస్తోంది . మహానటి బ్లాక్ బస్టర్ కావడంతో బాగా ఊపొచ్చింది అయితే జనవరి 9న విడుదలైన ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రం ఘోర పరాజయం పొందడంతో యాత్ర పై నీలినీడలు కమ్ముకున్నాయి . మహానటి లాగా యాత్ర బ్లాక్ బస్టర్ అవుతుందా ? లేక ఎన్టీఆర్ కథానాయకుడు లాగా డిజాస్టర్ అవుతుందా ? అన్న చర్చ మొదలయ్యింది . ఈ సినిమా తెలుగులోనే కాకుండా తమిళ , మలయాళ బాషలలో కూడా రూపొందింది.
English Title: YS Rajasekhar reddy Biopic Yatra censor report