బుల్లి తెరపై స్టార్ హీరోలు సందడి చేస్తున్న విషయం తెలిసిందే. కింగ్ నాగార్జున నుంచి నేచురల్ స్టార్ నాని వరకు బుల్లి తెరపై ఆకట్టుకున్న వారే. రియాలిటీ షోలతో బుల్లితెరపై తమ సత్తా చూపించినవారే. `ఆహా` ఓటీటీ కోసం సమంత హోస్ట్గా వ్యవహరిస్తోంది. మరో పక్క కింగ్ నాగార్జున బిగ్బాస్ సీజన్ 4కు హోస్ట్గా వ్యవహరిస్తూ ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు. ఈ టాక్ షోకు హ్యూజ్ క్రేజ్ పెరగడంతో టెలివిజన్ సంస్థలు టాలీవుడ్ స్టార్స్ తో రియాలిటీ షోలకు ప్లాన్ చేస్తున్నారట.
తాజాగా యంగ్టైగర్ ఎన్టీఆర్తో ప్రముఖ టీవి ఛానల్ జెమిని ఓ రియాలిటీ షోని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. టీఆర్పీ రేటింగ్లో ఫస్ట్ ప్లేస్లో వుండే జెమినీ టివి బిగ్బాస్ షోతో టాప్ 3 పొజీషన్కి పడిపోయింది. స్టార్ మా ఫస్ట్ ప్లేస్లోకి చేరిపోయింది. దీంతో రియలైజ్ అయిన సన్టీవీ యాజమాన్యం బిగ్బాస్ని మించిన రియాలిటీ షోని ప్లాన్ చేస్తోందట. దీనికి హోస్ట్గా యంగ్టైగర్ ఎన్టీఆర్ని ఒప్పించినట్టు తెలిసింది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్టార్ మా ఛానల్లో ప్రసారమైన రియాలిటీ షెఓ బిగ్బాస్ సీజన్ 1కి హోస్ట్గా వ్యవహరించి ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని పరిగణలోకి తీసుకున్న జెబిని టీవి యాజమాన్యం ఎన్టీఆర్తో భారీ రియాలిటీ షోని ప్లాన్ చేస్తున్నారట. ఇందు కోసం అన్నపూర్ణ స్టూడియోస్లో భారీ సెట్ని ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తోంది.