స్వర్గీయ నందమూరి తారకరామారావు జయంతి నేడు. ప్రతీ ఏటా ఈ రోజు నందమూరి ఫ్యామిలీ హీరోలు హైదరాబాద్ నక్లెస్ రోడ్లోని ఎన్టీఆర్ ఘాట్ని సందర్శించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే కరోనా మహమ్మారి కారణంగా లాక్డౌన్ విధించడంతో ఈ దఫా నందమూరి హీరోలు ఎవరూ ఎన్టీఆర్ ఘాట్ని సందర్శించడం లేదని హీరో ఎన్టీఆర్, నందమూరి కల్యాణ్రామ్ మీడియా ముఖంగా వెల్లడించిన విషయం తెలిసిందే.
ఇంటి వద్దే స్వర్గీయ ఎన్టీఆర్కు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా యంగ్టైగర్ ఎన్టీఆర్ పెట్టిన ఎమోషనల్ పోస్ట్ ఆకట్టుకుంటోంది. తాత ఫొటోని షేర్ చేసిన ఎన్టీఆర్ `మీరు లేని లోటు తీరనిది..అని.. మీ పాదం మోపక ఈ తెలుగు ధరిత్రి చిన్నబోతోంది. మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతోంది. పెద్ద మనసుతో ఈ ధరిత్రిని, ఈ గుండెని మరొక్కసారి తాకిపో తాత` అని ట్వీట్ చేయడం ఆకట్టుకుంటోంది.
యంగ్టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్`. రామ్చరణ్తో కలిసి ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రమిది. రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. జూన్ మొదటి వారంలో ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది.
మీరు లేని లోటు తీరనిది… pic.twitter.com/FA1uyWaWoS
— Jr NTR (@tarak9999) May 28, 2020
Credit: Twitter