మాదక ద్రవ్యాల కేసు కన్నడ నాట సంలచనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసుని విచారిస్తున్న బెంగళూరులోని బాణసవాడి ఉప విభాగం పోలీసులు తెలుగు నటుడు తనీష్తో పాటు మరో ఐదుగురిని విచారణకు హాజరు కావాలని నోటీనులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపూథ్యంలో తనీష్ గురించి పలు వార్త ఛానెళ్లలో పలు ఆసక్తికర కథనాలు ప్రసారం అయ్యాయి. దీనిపై నటుడు తనీష్ శనివారం స్పందించారు.
ఓ వీడియో సందేశం ద్వారా తనపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. నిజా నిజాలేమిటో తెలుసుకోకునేందుకు కనీసం సంప్రదించలేదని అన్నారు. ఆ వార్తలన్నీ తన కుటుంబాన్ని తీవ్రంగా బాధించాయని ఆవేదన వ్యక్తం చేశారు. బెంగళూరుకు చెందిన నిర్మాతకు డ్రగ్స్ నోటీసులు ఇచ్చిన మాట నిజమేనని, అయితే తనకు వచ్చిన నోటీసు అర్థం ఏమిటో తెలుసుకోకుండా ఇష్టానుసారంగా మీడియా ప్రచారం చేయడం సరికాదన్నారు.
రెండేళ్లుగా ఆ నిర్మాతతో తనకు సంబంధాలు లేవని తనీష్ తెలిపారు. ఈ కేసులో తనకు వచ్చిన నోటీసుకు కారణం వేరని, ఫలానా వ్యక్తి గురించి మీకు వివరాలు తెలిస్తే చెప్పండి` అని మాత్రమే తనకు నోటీసు వచ్చిందని తనీష్ వివరించారు. దయచేసి తనపై అసత్య ప్రచారం ఆపండని విన్నవించారు.