Homeటాప్ స్టోరీస్వెంకీ అట్లూరికి గోల్డెన్ ఆఫ‌ర్‌!

వెంకీ అట్లూరికి గోల్డెన్ ఆఫ‌ర్‌!

వెంకీ అట్లూరికి గోల్డెన్ ఆఫ‌ర్‌!
వెంకీ అట్లూరికి గోల్డెన్ ఆఫ‌ర్‌!

కెరీర్ తొలి నాళ్ల‌లో స్టార్ హీరో ని డైరెక్ట్ చేసే అవ‌కాశం రావాల‌ని ఎదురుచూడ‌ని డైరెక్ట‌ర్ అంటూ వుండ‌రు. అయితే అలా ఎదురుచూడ‌ని ఓ యంగ్ డైరెక్ట‌ర్‌కు ఆ గోల్డెన్ ఛాన్స్ ల‌భిస్తే ఆ కిక్కే వేరు. అలాంటి కిక్కే యంగ్ డైరెక్ట‌ర్ వెంకీ అట్లూరికి ల‌భించిన‌ట్టు తెలిసింది. మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్‌గా నిలిచిన చిత్రం `అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్‌`. పృథ్విరాజ్ సుకుమార‌న్‌, బీజు మీన‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. కె.ఆర్‌. స‌చి(స‌చిదానందన్) ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈయ‌న అనారోగ్యం కార‌ణంగా ఇటీవ‌లే మ‌ర‌ణించారు.

ఈ చిత్ర రీమేక్ హ‌క్కుల్ని సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ అధినేత సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ సొంతం చేసుకున్నారు. ప్ర‌త్యేకంగా ఈ స్క్రిప్ట్‌ని తెలుగు నేటివిటీకి మార్పించారు. `అప్ప‌ట్లో ఒక‌డుండేవాడు` చిత్రంతో విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లందుకున్న సాగ‌ర్ చంద్ర ఈ స్క్రిప్ట్‌ని తెలుగు నేటివిటీకి అనుగునంగా మార్చారు. అయితే ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసే బాధ్య‌త‌ల్ని యంగ్ డైరెక్ట‌ర్ వెంకీ అట్లూరికి అప్ప‌గించిన‌ట్టు తెలిసింది. ఈ చిత్రాన్ని ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌తో రీమేక్ చేయ‌బోతున్నారు. మ‌రో కీల‌క పాత్ర‌లో త‌మిళ హీరో విజ‌య్ సేతుప‌తి న‌టించ‌నున్నార‌ట‌.

- Advertisement -

ఇటీవ‌ల ప్ర‌త్యేకంగా ఈ చిత్రాన్ని చూసిన ప‌వ‌న్‌క‌ల్యాణ్ అత్యంత త‌క్కువ రోజుల్లో ఈ చిత్రాన్ని చేయ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ట‌. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాల్ని మేక‌ర్స్ ప‌వ‌ర్‌స్టార్ పుట్టిన రోజైన సెప్టెంబ‌ర్ 2న ప్ర‌క‌టించే అవకాశం వుంద‌ని తెలిసింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All