Homeటాప్ స్టోరీస్ఆత్మహత్య కు పాల్పడిన యువ దర్శకుడు

ఆత్మహత్య కు పాల్పడిన యువ దర్శకుడు

young director rajasimha attempts suicideకెరీర్ అనుకున్నంతగా సాగకపోవడంతో డిప్రెషన్ కు గురైన యువ దర్శకుడు ” రాజసింహ ” ముంబై లో ఆత్మహత్య కు పాల్పడ్డాడు . అయితే వెంటనే గమనించిన రాజసింహ ఆప్తులు ఓ ప్రయివేట్ ఆసుపత్రికి తరలించారు , ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు రాజసింహ . నిద్ర మాత్రలు అధిక మోతాదులో తీసుకోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది . 2016 లో వచ్చిన ” ఒక్క అమ్మాయి తప్ప ” చిత్రానికి దర్శకత్వం వహించాడు రాజసింహ .

సందీప్ కిషన్ – నిత్యా మీనన్ జంటగా నటించిన ఒక్క అమ్మాయి తప్ప సినిమా అనుకున్న రేంజ్ లో ఆడలేదు దాంతో డైరెక్టర్ గా విఫలమయ్యాడు , అంతకుముందు రుద్రమదేవి చిత్రానికి పనిచేసాడు రాజసింహా. రుద్రమదేవి చిత్రంలో అల్లు అర్జున్ గోన గన్నారెడ్డి గా నటించిన విషయం తెలిసిందే . అల్లు అర్జున్ డైలాగ్స్ రాజసింహ రాసినవే , ఆ డైలాగ్స్ కు అనూహ్య స్పందన వచ్చింది అలాగే అల్లు అర్జున్ కూడా రాజసింహ ని మెచ్చుకున్నాడు కూడా . కెరీర్ పరంగా అలాగే వ్యక్తిగత సమస్యలతో ఆత్మహత్య కు పాల్పడి ఉంటాడని అంటున్నారు అతడి సన్నిహితులు . మొత్తానికి గండం నుండి బయటపడటంతో రాజసింహ సన్నిహితులు ఊపిరి పీల్చుకున్నారు .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All