Homeటాప్ స్టోరీస్క‌రోనాతో మ‌రో డైరెక్ట‌ర్ మృతి

క‌రోనాతో మ‌రో డైరెక్ట‌ర్ మృతి

క‌రోనాతో మ‌రో డైరెక్ట‌ర్ మృతి
క‌రోనాతో మ‌రో డైరెక్ట‌ర్ మృతి

క‌రోనా మ‌హ‌మ్మారి భార‌త్‌పై క‌రాల‌నృత్యం చేస్తోంది. దీని ధాటికి చిన్నా పెద్దా అని తేడా లేకుండా అన్ని వ‌య‌సుల వారు మృత్యు వాత ప‌డుతున్నారు. భార‌త్‌లో క‌రోనా సెకండ్ వేవ్ మృత్యుగంటిక‌లు మోగిస్తోంది. మొద‌టి దానితో పోలిస్తే సెకండ్ వేవ్ అత్యంత విల‌యాన్ని సృష్టిస్తుండ‌టంతో చాలా మంది జ‌నం పిట్ట‌ల్లా రాలిపోతున్నారు.

ముఖ్యంగా చెప్పాలంటే సినీ వ‌ర్గాల‌పై క‌రోనా పంజా విసురుతోంది. ఇప్ప‌టికే దీని బారిన ప‌డిన చాలా మంది న‌టులు మృతి చెందారు. తాజాగా మ‌రో యువ ద‌ర్శ‌కుడు క‌రోనా కార‌ణంగా క‌న్నుమూయ‌డం టాలీవుడ్‌లో విషాదాన్ని పనింపింది. యంగ్ డైరెక్ట‌ర్ కుమార్ వ‌ట్టి క‌రోనా కాటుకు బ‌ల‌య్యారు. శ్రీ‌విష్ణుతో `మా అబ్బాయి` చిత్రాన్ని తెర‌కెక్కించిన కుమార్ వ‌ట్టికి ఇటీవ‌ల క‌రోనా సోకింది. అనంత‌రం ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి ఆందోళ‌న క‌రంగా వుండ‌టంతో ఆయ‌న కుటుంబ స‌భ్యులు ఆయ‌న‌ని ఆసుప‌త్రిలో జాయిన్ చేశారు.

- Advertisement -

అయితే ప‌రిస్థితి విష‌మించ‌డంతో ఆయ‌న శుక్ర‌వారం తుదిశ్వాస విడిచారు. కుమార్ వ‌ట్టిది శ్రీ‌కాకుళం జిల్లాలోని న‌ర్స‌న్న‌పేట‌. ద‌ర్శ‌కుడు ప‌ర‌శురామ్ వ‌ద్ద ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా ప‌ని చేశారు. 2017లో శ్రీ‌విష్ణు హీరోగా నటించిన `మా అబ్బాయి` సినిమాతో ద‌ర్శ‌కుడిగా మారారు. కుమార్ వ‌ట్టి ఆక‌స్మిక మ‌ర‌ణం ప‌ట్ల ప‌లువురు సినీ వ‌ర్గాలు తీవ్ర సంతాపం వ్య‌క్తం చేశారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All