మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన చిత్రం రిపబ్లిక్ అక్టోబర్ 1న విడుదల కానుంది. పొలిటికల్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం మంచి బజ్ ను సాధించింది. అటు ప్రోమోస్ కానీ సాంగ్స్ కానీ ఆసక్తికరంగా ఉండడంతో అందరూ ఈ చిత్రం పట్ల ఆసక్తి చూపించారు. అయితే అనుకోకుండా సాయి ధరమ్ తేజ్ కు యాక్సిడెంట్ జరిగిన విషయం తెల్సిందే.
ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ కు బాగానే ఉంది. కానీ ఇంకా కోలుకోవాల్సిన అవసరం ఉంది. వైద్యులు ఎందుకైనా మంచిదని రెస్పిరేటరీ సపోర్ట్ మీద ఉంచారు. సాధారణ పరిస్థితుల్లో అయితే సాయి ధరమ్ తేజ్ ఈపాటికి రిపబ్లిక్ ను ప్రమోట్ చేస్తూ ఇంటర్వ్యూలు ఇస్తూ ఉండేవాడు కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు.
మరి రిపబ్లిక్ నిర్మాతలు ఏం చేస్తారు? సినిమా రిలీజ్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్నది చూడాలి. ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా చేసిన ఈ సినిమాను దేవా కట్టా డైరెక్ట్ చేసాడు. జీ గ్రూప్ సంస్థ ఈ చిత్ర హోల్ సేల్ రైట్స్ ను కొనుగోలు చేసింది.