కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. చైనాలో పుట్టిన ఈ వైరల్ ప్రస్తుతం వరల్డ్ వైడ్గా భయాందోళనకు గురిచేస్తోంది. ఈ వైరస్ భారిన పడిన వాళ్లు ఇప్పటి వరకు చైనాలో 350కి మించి మృత్యు వాత పడ్డారని, మరి కొంత మంది ఈ వైరస్ కారణంగా నరకం చూస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ వైరస్ పర్యాటక ప్రదేశమైన థాయిలాండ్ని తాకిందని, అక్కడి వారిని వణికిస్తోందని వరుస కథనాలు వినిపిస్తున్నాయి.
వైరస్ వ్యాప్తని అరికట్టామని, పర్యాటకులు ఆందోళన చెందాల్సిన పనిలేదని థాయ్లాండ్ ప్రభుత్వం వరుస ప్రకటనలు చేస్తున్నా అక్కడికి వెళ్లడానికి ఎవరూ సాహసించడం లేదు. కరోనా వైరల్ కారణంగా థాయల్లాండ్లో జరపాల్సిన షెడ్యూల్ని `వైల్డ్ డాగ్` చిత్ర బృందం వాయిదా వేయడం చర్చనీయాంశంగా మారింది. నాగార్జున హీరోగా అహిషోర్ సొలోమన్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. నాగ్ ఎన్ైఏ కమాండోగా నటిస్తున్న ఈ సినిమాలో `రేయ్` ఫేమ్ సయామీఖేర్ ఓ కీలక పాత్రలో నటిస్తోంది.
సినిమాలో ఆమెపై పోరాట ఘట్టాల్ని కూడా డిజైన్ చేశారు. నెల రోజుల పాటు మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్లో సయామీఖేర్ శిక్షణ కూడా తీసుకుంది. థాయ్లాండ్లో కీలక షెడ్యూల్ని జరపాలనుకున్నారు. తాజాగా కరోనా వైరస్ పెచ్చరిల్లు తుండటంతో రిస్క్ తీసుకోవడం ఎందుకని షూటింగ్ని వాయిదా వేసినట్టు హీరోయిన్ సయామీఖేర్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.