
సునాయాసంగా వరుస విజయాలతో టీమిండియా ఆసియా కప్ ఫైనల్కు చేరుకుంటుందనుకుంటే.. సీన్ కాస్తా రివర్స్ అయింది. వరుస ఓటములతో ఇంటికి ముఖం పట్టేందుకు సిద్దమైంది రోహిత్ సేన. మొన్న పాకిస్తాన్, నిన్న శ్రీలంక.. అటు బౌలింగ్.. ఇటు బ్యాటింగ్.. రెండింటిలోనూ టీమిండియా విఫలమైంది. ఫైనల్ అవకాశాలను తుడిచిపెట్టేసుకుంది. దుబాయ్ వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో రోహిత్ సేన 6 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. భారీ టార్గెట్ చేధించే క్రమంలో లంక బ్యాట్స్మెన్లు ఏమాత్రం తడబడకుండా.. టీమిండియా బౌలర్లను ధీటుగా ఎదుర్కున్నారు.
వెరిసి రెండు మ్యాచ్లలోనూ అద్భుత విజయాలను అందుకుని ఫైనల్ స్పాట్ను ఖరారు చేసుకున్నారు. అటు టీమిండియా నిష్క్రమణకు దగ్గరైంది. అయితే శ్రీలంకపై ఓడిపోయినప్పటికీ టీమిండియా ఫైనల్ చేరేందుకు ఇంకా అవకాశాలు ఉన్నాయి. అదెలాగంటే.. ఇప్పుడు టీమిండియా ఫైనల్ చేరాలంటే.. ఇతర టీంల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంది. ఇవాళ ఆఫ్ఘానిస్తాన్పై, శుక్రవారం శ్రీలంకపై పాకిస్తాన్ జట్టు ఓడిపోవాలి. అలాగే భారత్.. ఆఫ్గాన్పై భారీ తేడాతో గెలవాలి. అప్పుడే ప్రతీ టీంకు రెండేసి పాయింట్లు ఉంటాయి. ఇక ఇప్పుడు నెట్ రన్రేట్ను ప్రామాణికంగా తీసుకుంటారు. అందరికంటే మనది ఎక్కువగా ఉంటేనే ఫైనల్కు వెళ్తాం. అయితే ఇక్కడొక ట్విస్ట్.. ఒకవేళ ఈరోజు జరిగే మ్యాచ్లో ఆఫ్గాన్పై పాక్ గెలిస్తే.. రోహిత్ సేన ఇంటికి చేరడం ఖాయం. కాగా, ఆసియా కప్లో భారత్ ఓటమిపాలవ్వడానికి ప్రయోగాలే కారణమని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. అనుభవం లేని ప్లేయర్స్ను జట్టులోకి తీసుకుని.. చేజేతులారా మ్యాచ్ను పోగొట్టుకున్నారని మండిపడుతున్నారు.
ఇదిలా ఉండగా.. తప్పకుండా గెలవాల్సిన మ్యాచ్లో టీమిండియా ప్లేయర్స్ చేతులెత్తేశారు. బౌలింగ్లో పేలవ ప్రదర్శన చేయడంతో రోహిత్ సేన భారీ మూల్యాన్ని చెల్లించుకుంది. దీంతో సూపర్ 4లో భారత్ వరుసగా రెండు పరాజాయాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. చివరి వరకు ఉత్కంఠ భరితంగా జరిగిన మ్యాచ్లో శ్రీలంక ఆరు వికెట్ల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసుకుంది. శ్రీలంక బ్యాట్స్మెన్లో కుసల్ మెండిస్ 57 పరుగులు, పాతుమ్ నిస్సాంక 52 పరుగులు సాధించి మ్యాచ్ విజయంలో కీలకపాత్ర పోషించారు.
భారత్ ఇచ్చిన 174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక తొలి నుంచి దూకుడుగా ఆడింది. ఓపెనర్లు దూకుడుగా ఆడుతూ జట్టు స్కోర్ను పరుగులు పెట్టించారు. అయితే పాతుమ్ నిస్సాంక అవుట్ అయిన తర్వాత శ్రీలం వరుస వికెట్లను కోల్పోయింది. నాలుగు వికెట్లు కోల్పోవడంతో టీమిండియా విజయం ఖరారు అనుకుంటున్న తరుణంలో క్రీజులోకి వచ్చి రాజపక్సా 25, దసున్ షనక 33 రన్స్తో సమిష్టిగా ఆడడంతో శ్రీలంక విజయాన్ని అందుకుంది. ఇక అంతకు ముందు బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 173 పరుగులు సాధించింది. రోహిత్ శర్మ 72 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం సూర్యకుమార్ యాదవ్ 34 పరుగులు చేశాడు. మిగతా ప్లేయర్స్ మాత్రం 20 పరుగుల మార్క్ను దాటలేదు. టీమిండియా ఇంకో 10 నుంచి 20 పరుగులు చేసి ఉంటే విజయ అవకాశాలు ఎక్కువగా ఉండేవి.