సంచలన చిత్రం `క్రాక్` వివాదం తరువాత వరంగల్ శ్రీను తెలుగు ప్రేక్షకులతో పాటు డ్రేడ్ వర్గాల్లో కూడా బాగా పాపులర్ అయ్యారు. ఈ పంపిణీదారుడు రాబోయే వివిధ క్రేజీ ప్రాజెక్టుల హక్కులను పొందిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వరంగల్ శ్రీను ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారిన విషయం తెలిసిందే. తను ఇప్పుడు తమిళ స్టార్ కార్తీ మూవీ `సుల్తాన్` డిస్ట్రిబ్యూషన్ హక్కుల్ని పోటీపడి మరీ దక్కించుకున్నట్టు తెలిసింది.
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ పంపిణీ హక్కులను వరంగల్ శ్రీను భారీ మొత్తానికి దక్కించుకున్నారు.
తెలంగాణ మరియు ఎపీ హక్కులకు గానూ 7.30 కోట్లు ప్లస్ జీఎస్టీ కలిపి ఫాన్సీ మొత్తాన్నిపెట్టుబడిగా పెట్టినట్లు తెలిసింది. ఇది భారీ మొత్తమని తెలిసి డిస్ట్రీ బ్యూటర్స్ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారట. ఈ చిత్ర టీజర్ ఇటీవల విడుదలై సంచలనం సృష్టిస్తోంది.
మంచి క్రేజ్ని దక్కించుకుంది. ట్రేడ్ వర్గాల్లోనూ ఈ మూవీపై బారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే అందరిని కాదని వరంగల్ శ్రీను ఈ చిత్ర పంపిణీ హక్కుల్ని దక్కించుకోవడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. రష్మిక మండన్నహీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి బక్కియరాజ్ కన్నన్ దర్శకత్వం వహిస్తున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 2న విడుదల కానుంది.