తిమ్మరుసు, ఎస్ఆర్ కళ్యాణమండపం చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద డీసెంట్ నెంబర్స్ ను పోస్ట్ చేసాయి. పరిస్థితులు ఎలా ఉన్నా కంటెంట్ డీసెంట్ గా తెలుగు ప్రేక్షకులు సినిమా చూడటానికి వస్తారని తెలిపాయి. ఈ నేపథ్యంలో మరిన్ని మీడియం బడ్జెట్ చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడటానికి సిద్ధమవుతున్నాయి.
ఈ క్రమంలో తర్వాత విడుదల కానున్న చిత్రం పాగల్, విశ్వక్ సేన్ హీరోగా నటించిన ఈ చిత్రం షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా పూర్తి చేసుకుంది. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఆగస్ట్ 14న ఈ సినిమా విడుదల కానుంది. యూత్ ఫుల్ రొమాంటిక్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రాన్ని నరేష్ డైరెక్ట్ చేసాడు.
నివేతా పేతురాజ్, సిమ్రాన్ చౌదరి, మేఘాలేఖ హీరోయిన్లుగా నటించారు. రిలీజ్ డేట్ ను ఖరారు చేసిన దిల్ రాజు త్వరలోనే దాన్ని అనౌన్స్ చేయబోతున్నాడు. ప్రమోషన్స్ ను కూడా భారీ లెవెల్లోనే ప్లాన్ చేసాడు. ఇక ప్రస్తుతం విశ్వక్ సేన్ ఓ మై కడవులే తెలుగు రీమేక్ లో నటిస్తున్నాడు. కప్పేలా రీమేక్ లో నటించాల్సి ఉంది.