Homeటాప్ స్టోరీస్వివాదంలో విశాల్ ఇరుంబు తిరై చిత్రం

వివాదంలో విశాల్ ఇరుంబు తిరై చిత్రం

vishal irumbu thirai in trouble కేంద్ర ప్రభుత్వం విధించిన జి ఎస్ టి పైన ఇప్పటికే పలు వివాదాలు రాగా విజయ్ నటించిన మెర్సల్ కొంతమంది బీజేపీ నాయకులకు నచ్చలేదు దాంతో ఆ సినిమాలోని డైలాగ్స్ ని మ్యూట్ చేయించారు . కట్ చేస్తే ఇప్పుడు ఆధార్ కార్డ్ పైన దాని లొసుగులపైన విశాల్ నటించిన ” ఇరుంబుతిరై ” సరికొత్త వివాదాన్ని రాజేసింది . కేంద్ర ప్రభుత్వం డిజిటల్ ఇండియా అంటూ కొత్త పథకాన్ని ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే . జిఎస్ టి పై అలాగే డిజిటల్ ఇండియా పై విశాల్ సినిమాలో సెటైర్ లు వేసాడని ఆగ్రహంగా ఉన్నారు బిజెపి శ్రేణులు దాంతో వివాదం మొదలయ్యింది .

ఇటీవలే విడుదలైన ” ఇరుంబుతిరై ” చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడ్తున్నారు దాంతో కాషాయ నేతలకు ఎక్కడా లేని కోపం వస్తోంది . అందుకే విశాల్ సినిమాపై కోర్టులో కేసు వేశారు . కేంద్ర ప్రభుత్వం పై విశాల్ విమర్శలు గుప్పించాడని , విశాల్ ఇంటిని ముట్టడించడానికి ప్రయత్నం చేసారు అయితే పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసారు . విశాల్ సరసన సమంత నటించిన ఈ చిత్రాన్నీ తెలుగులో అభిమన్యుడు గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . మరి తెలుగులో ఆ డైలాగ్స్ ఉంటాయో మ్యూట్ చేస్తారో చూడాలి .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All