Homeటాప్ స్టోరీస్పెళ్లి మండపం బుక్ చేసిన హీరో

పెళ్లి మండపం బుక్ చేసిన హీరో

vishal confirmed his marriage in 2019 పెళ్లి చేసుకునేది ఈ ఏడాది కాదు 2019 లో అది కూడా జనవరి లో అంటే ఇంకా 11 నెలల సమయం ఉంది పెళ్ళికి అయినప్పటికీ ఇప్పుడే పెళ్లి మండపం బుక్ చేసాడు తమిళ స్టార్ హీరో విశాల్ . ప్రస్తుతం కల్యాణ మండపం నిర్మాణం జరుగుతోంది అయితే అది ఈ ఏడాది డిసెంబర్ కల్లా పూర్తవుతుందని కాంట్రాక్టర్ చెప్పాడట దాంతో అందులో మొదటగా జరగాల్సింది నా పెళ్లే అని ఎప్పుడో ఫిక్స్ అయ్యాడు విశాల్ అందుకే ఇప్పుడే అడ్వాన్స్ కూడా ఇచ్చేసాడు పెళ్లి మండపానికి .

పెళ్లి కొడుకు ఉన్నాడు అలాగే పెళ్లి మండపం కూడా రెడీ అవుతోంది మరి పెళ్లి కూతురు ఎవరు ? అనే కదా మీ డౌట్ ? అధికారికంగా చెప్పలేదు కానీ పెళ్లి కూతురు మాత్రం హీరోయిన్ వరలక్ష్మి . శరత్ కుమార్ కూతురు అయిన వరలక్ష్మి ని గతకొంత కాలంగా విశాల్ ప్రేమిస్తున్నాడు , ఇక వరలక్ష్మి కూడా విశాల్ ని ప్రేమిస్తోంది కానీ విశాల్ కు శరత్ కుమార్ కు పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది . ఇప్పటికి కూడా ఆ ఇద్దరి మధ్య మాటలు లేవు మరి ఇలాంటి సందర్భంలో  విశాల్ పెళ్లి ఎలాంటి వివాదాలను తెస్తుందో చూడాలి . 

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All