తెలుగు, తమిళ భాషల్లో విలక్షణ నటుడిగా చియాన్ విక్రమ్కు మంచి పేరుంది. గత కొంత కాలంగా అనుకున్న స్థాయిలో ఆయన ప్రేక్షకుల్ని, అభిమానుల్ని ఆకట్టుకోలేకపోతున్నారు. ప్రస్తుతం జ్ఞానముత్తు రూపందిస్తున్న `కోబ్రా`, మణిరత్నం తెరకెక్కిస్తున్న `పొన్నియిన్ సెల్వన్` చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ రెండు చిత్రాలు ప్రస్తుతం చిత్రీకరణ దశలో వున్నాయి.
ఇదిలా వుంటే తాజాగా విక్రమ్ మరో చిత్రాన్ని అంగీకరించారు. విభిన్న చిత్రాల దర్శకుడిగా కార్తిక్ సుబ్బరాజుకు మంచి పేరుంది. ఆయన దర్శకత్వంలో విక్రమ్ ఓ బారీ చిత్రం చేయబోతున్నారు. ఇది విక్రమ్ నటిస్తున్న 60వ చిత్రం. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ ఈ చిత్రాన్ని నిర్మించబోతోంది. ఈ చిత్రంలో విక్రమ్ తనయుడు ధృవ్ కూడా నటించబోతున్నాడు.
ధృవ్ ఇటీవల తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిన పాథ్బ్రేకింగ్ ఫిల్మ్ `అర్జున్రెడ్డి` రీమేక్తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. తొలిసారి చియాన్ విక్రమ్, ధృవ్ కలిసి మల్టీస్టారర్ చిత్రంలో నటించనుండటంతో ఈ మూవీ కోలీవుడ్లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.