Homeటాప్ స్టోరీస్తండ్రీ కొడుకుల‌తో క్రేజీ మ‌ల్టీస్టార‌ర్‌!

తండ్రీ కొడుకుల‌తో క్రేజీ మ‌ల్టీస్టార‌ర్‌!

తండ్రీ కొడుకుల‌తో క్రేజీ మ‌ల్టీస్టార‌ర్‌!
తండ్రీ కొడుకుల‌తో క్రేజీ మ‌ల్టీస్టార‌ర్‌!

తెలుగు, త‌మిళ భాష‌ల్లో విల‌క్ష‌ణ న‌టుడిగా చియాన్ విక్ర‌మ్‌కు మంచి పేరుంది. గ‌త కొంత కాలంగా అనుకున్న స్థాయిలో ఆయ‌న ప్రేక్ష‌కుల్ని, అభిమానుల్ని ఆక‌ట్టుకోలేక‌పోతున్నారు. ప్ర‌స్తుతం జ్ఞాన‌ముత్తు రూపందిస్తున్న `కోబ్రా`, మ‌ణిర‌త్నం తెర‌కెక్కిస్తున్న `పొన్నియిన్ సెల్వ‌న్‌` చిత్రాల్లో న‌టిస్తున్నారు. ఈ రెండు చిత్రాలు ప్ర‌స్తుతం చిత్రీక‌రణ ద‌శ‌లో వున్నాయి.

ఇదిలా వుంటే తాజాగా విక్ర‌మ్ మ‌రో చిత్రాన్ని అంగీక‌రించారు. విభిన్న చిత్రాల ద‌ర్శ‌కుడిగా కార్తిక్ సుబ్బ‌రాజుకు మంచి పేరుంది. ఆయ‌న ద‌ర్శ‌‌క‌త్వంలో విక్ర‌మ్ ఓ బారీ చిత్రం చేయ‌బోతున్నారు. ఇది విక్ర‌మ్ న‌టిస్తున్న 60వ చిత్రం. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ ఈ చిత్రాన్ని నిర్మించ‌బోతోంది. ఈ చిత్రంలో విక్ర‌మ్ త‌న‌యుడు ధృవ్ కూడా న‌టించ‌బోతున్నాడు.

- Advertisement -

ధృవ్ ఇటీవ‌ల తెలుగులో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచిన పాథ్‌బ్రేకింగ్ ఫిల్మ్ `అర్జున్‌రెడ్డి` రీమేక్‌తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన విష‌యం తెలిసిందే. తొలిసారి చియాన్ విక్ర‌మ్‌, ధృవ్ క‌లిసి మ‌ల్టీస్టార‌ర్ చిత్రంలో న‌టించ‌నుండ‌టంతో ఈ మూవీ కోలీవుడ్‌లో టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా మారింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All