Homeటాప్ స్టోరీస్సౌత్ లో మరో బిగ్ మల్టీస్టారర్...

సౌత్ లో మరో బిగ్ మల్టీస్టారర్…

సౌత్ లో మరో బిగ్ మల్టీస్టారర్...
సౌత్ లో మరో బిగ్ మల్టీస్టారర్…

కోలీవుడ్ లో మరో బిగ్ మల్టి స్టారర్ సినిమాకు ప్లాన్స్ జరుగుతున్నాయి. కెరీర్ మొదట్లోనే యువ కథానాయకుడు ధృవ్ తండ్రితో స్క్రీన్ షేర్ చేసుకునేందుకు సిద్దమవుతున్నాడు. మీరు ఊహించింది నిజమే. విక్రమ్ – ధృవ్ కథానాయకులుగా మల్టీస్టారర్ రూపొందనుంది. ఈ విషయాన్నీ ఇటీవల ఫోర్ ఎంటర్టైన్మెంట్స్ అధినేత ముఖేష్ మెహతా ప్రకటించారు.

ధృవ్ నటించిన ఆదిత్య వర్మ నవంబర్ 8న రిలీజ్ కాబోతోంది. సినిమా టీజర్ కి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ జోష్ ని మరింత పెంచేసింది. ఇక ఆడియో వేడుకను కూడా ఘనంగా నిర్వహించి సినిమాపై అంచనాలు పెంచేశారు. అయితే ఆదిత్య వర్మ రిలీజ్ అనంతరం ధృవ్ ఎలాంటి సినిమా చేస్తాడనేది ఇంకా ఫైనల్ కాలేదు.
కానీ రానున్న 2021 సంవత్సరం తరువాత ధృవ్ తండ్రితో కలిసి ఒక బిగ్ మల్టీస్టారర్ లో నటించడం పక్కా అని ముఖేష్ తెలియజేశారు. దీంతో ఒక్కసారిగా ఈ వార్త ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. ధృవ్ తండ్రితో కలిసి ఎలాంటి సినిమా చేస్తాడా అని అందరూ ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఇక విక్రమ్ ప్రస్తుతం ధ్రువ నక్షత్రం, పొన్నియిన్ సెల్వం సినిమాలతో బిజీగా ఉన్నాడు.
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All