`బాహుబలి`తో విజయేంద్ర ప్రసాద్ పేరు దేశ వ్యాప్తంగా మారుమ్రోగిపోయింది. ఆ తరువాత చేసిన భజరంగీ భాయిజాన్, మణికర్ణిక చిత్రాలు కూడా విజయేంద్ర ప్రసాద్కు మంచి పేరుని తీసుకొచ్చాయి. ప్రస్తుతం ఆయన రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ `ఆర్ ఆర్ ఆర్`కు కథ అందించారు. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ దశలో వుంది.
ఈ మూవీతో పాటు `తలైవి`కి కూడా విజయేంద్ర ప్రసాదే కథ అందించారు. ఈ రెండు చిత్రాలు పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్నవే. తాజాగా మరో పాన్ ఇండియా చిత్రానికి కథ అందించబోతున్నారు. అది కూడా మైథలాజికల్ మూవీకి ఆయన స్క్రిప్ట్ అందించబోతున్నారు. `సీత` `ది ఇన్ కార్నేషన్`. బహు భాషా చిత్రంగా ఈ మూవీని తెరకెక్కించబోతున్నారు.
తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ మూవీ తెరపైకి రాబోతోంది. అలౌకిక్ దేశాయ్ దర్శకత్వం వహించనున్నారు. దీనికి కథ, స్క్రీన్ప్లేని అలౌకిక్ తో కలిసి విజయేంద్ర ప్రసాద్ కథ, స్క్రీన్ప్లే అందిస్తున్నారు. `యాన్ ఎన్టోల్డ్ స్టోరీ` అని క్యాప్షన్ ఇచ్చారు. సీత గురించి తెలియని కోణం వుందా అన్నదే ఆసక్తిని రేకెత్తిస్తోంది. త్వరలోనే ఈ చిత్ర ప్రారంభానికి సంబంధించిన మరిన్ని వివరాల్ని మేకర్స్ ప్రకటించనున్నట్టు తెలిసింది.