13 ఏళ్ల విరామం తరువాత మళ్లీ కెమెరా ముందుకొచ్చారు లేడీ అమితాబ్ విజయశాంతి. మహేష్ హీరోగా నటించిన `సరిలేరు నీకెవ్వరు` చిత్రంతో ఆమె రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ తరువాత చాలా మంది నటించమని అడిగినా రెమ్యునరేషన్, క్యారెక్టర్ డిమాండ్ వంటి కారణాలతో తిరస్కరిస్తూ వస్తున్నారు. తన పాత్రకు ప్రాధాన్యత వుంటేనే నటిస్తానని లేదంటే నటించనని ఇటీవల విజయశాంతి కరాఖండీగా వెల్లడించిన విషయం తెలిసిందే.
అయితే తాజాగా ఆమె మెగాస్టార్స్తూ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్కడ సంచలన విజయాన్ని సాధించింది. సిస్టర్ సెంటిమెంట్ నేపథ్యంలో రూపొంది చిరంజీవి నటిస్తున్న ఓ చిత్రంలో కీలకమైన సిస్టర్ పాత్రలో నటించనుందంటూ వార్తలు షికారు చేస్తున్నాయి. మలయాళ హిట్ చిత్రం `లూసీఫర్`. మోహన్లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ నటిన ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ని తెలుగులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రీమేక్ చేయబోతున్నారు.
`సాహో` ఫేమ్ సుజీత్ దర్శకత్వం వహించనున్నాడు. ఇందులోని కీలక సిస్టర్ పాత్రని విజయశాంతి చేసే అవకాశం వుందని వార్తలు వినిపిస్తున్నాయి. దాదాపు 15 చిత్రాల్లో జంటగా నటించిన చిరంజీవి, విజయశాంతి ఈ రీమేక్ కోసం అన్నా చెల్లెల్లుగా నటిస్తారా అన్నది ఇండస్ట్రీ వర్గాలకి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇందులో నిజమెంత అన్నది తెలియాలంటే చిత్ర బృందం వెల్లడించే వరకు వేచి చూడాల్సిందే.