స్టార్ హీరో విజయ్ దేవరకొండ కెరీర్ లో పెద్ద బ్రేక్ వచ్చింది. కరోనా వైరస్ కారణంగా 2020లో స్టార్ట్ అయిన విజయ్ నెక్స్ట్ సినిమా లైగర్ షూటింగ్ ఇంకా పూర్తవ్వలేదు. పూరి జగన్నాథ్ ఈ చిత్రానికి దర్శకుడన్న విషయం తెల్సిందే. సాధారణంగా పూరి జగన్నాథ్ 5 లేదా 6 నెలల్లో షూటింగ్ ను పూర్తి చేసేస్తాడు. కానీ లైగర్ విషయంలోనే లెక్క తప్పింది.
లైగర్ ఇంకా మెజారిటీ షూటింగ్ ను పూర్తి చేయాల్సి ఉంది. విజయ్ దేవరకొండ నెక్స్ట్ సినిమాకు వెళ్ళడానికి చూస్తున్నాడు. అందుకోసమే లైగర్ విషయంలో టార్గెట్ ను సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. మూడు నెలల లోపు లైగర్ షూటింగ్ ను పూర్తి చేయాలని అనుకుంటున్నాడు. ఇదే విషయాన్ని పూరి వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తోంది.
బాక్సింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమా కోసం లెజండరీ బాక్సర్ మైక్ టైసన్ ను సంప్రదించారు. అనన్య పాండే ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.