Homeటాప్ స్టోరీస్2022లో ఇండియా షేక్ అవుతుంది: విజయ్ దేవరకొండ

2022లో ఇండియా షేక్ అవుతుంది: విజయ్ దేవరకొండ

2022లో ఇండియా షేక్ అవుతుంది: విజయ్ దేవరకొండ
2022లో ఇండియా షేక్ అవుతుంది: విజయ్ దేవరకొండ

నిన్న రాత్రి జరిగిన రొమాంటిక్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ సందడి చేసాడు. పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి హీరోగా చేసిన చిత్రం రొమాంటిక్. కేతిక శర్మ హీరోయిన్ గా నటించగా పూరి శిష్యుడు అనిల్ పాడూరి దర్శకత్వం వహించాడు. ఛార్మి ఈ చిత్రానికి నిర్మాత కాగా పూరి జగన్నాథ్ కథ, డైలాగ్స్ అందించాడు. రొమాంటిక్ ఈ నెల 29న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ప్రీ రరిలీజ్ ఈవెంట్ నిన్న వరంగల్ లో జరిగింది.

ఈ సందర్భంగా స్పెషల్ గెస్ట్ గా వచ్చిన విజయ్ దేవరకొండ రొమాంటిక్ టీమ్ కు ఆల్ ది బెస్ట్ చెబుతూ దాదాపు అదే కోర్ టీమ్ తో తాను చేస్తోన్న లైగర్ గురించి కూడా స్పందించాడు.

- Advertisement -

“గత కొన్ని నెలలుగా మీరు అసహనానికి లోనవుతున్నారు. అందుకే లైగర్ గురించి ఒక క్లారిటీ ఇద్దామనుకుంటున్నా. డెస్టినీ మా ముగ్గురినీ (విజయ్, పూరి, ఛార్మి) కలిపింది. వీళ్ళు ఎంత కష్టపడుతున్నారో నాకు తెలుసు. ఈ సినిమాకు వీళ్ళ కష్టం ఒక్క విజువల్ పడితే అర్ధమైపోతుంది. మేము ఒక్కటే ఫిక్స్ అయ్యాం. ఇండియా షేక్ అవ్వాలి. 2022లో ఆగ్ లగాదేంగే. ఫిక్స్ అయిపోండి.” అని తన మాటలతో అంచనాలను పెంచేసాడు.

లైగర్ ప్యాన్ ఇండియా రిలీజ్ కానున్న విషయం తెల్సిందే. అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. బాక్సింగ్ లెజండ్ మైక్ టైసన్ కీలక పాత్రలో కనిపిస్తాడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All