క్రేజీ డైరెక్టర్ సుకుమార్.. సెన్సేషనల్ స్టార్.. అభిమానుల ముద్దుల రౌడీ విజయ్ దేవరకొండ కలయికలో ఓ భారీ మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. 2020లో అనౌన్స్ అయిన క్రేజీ ప్రాజెక్ట్గా ఈ కాంబినేషన్ నిలిచింది. ఫాల్కన్ క్రియేషన్స్ బ్యానర్పై ఈ మూవీని నూతన నిర్మాత, హీరో విజయ్ దేవరకొండ స్నేహితుడు కేదార్ సెలగమ్శెట్టి నిర్మించబోతున్నారు.
ఇటీవలే ఈ ప్రాజెక్ట్ని చిత్ర బృందం అఫీషియల్గా ప్రకటించింది. యువ నిర్మాత కేదార్ సెలగమ్శెట్టి పుట్టిన రోజు సందర్భంగా ఈ ప్రాజెక్ట్ని అనౌన్స్ చేశారు. 2022లో ఈ చిత్రాన్ని ప్రారంభిస్తామని కూడా అప్పుడే వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్ ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకునేలా వుంటుందని, ఊహకందని స్థాయిలో సినిమా వుంటుందని విజయ్ దేవరకొండ కూడా ప్రకటించారు.
ఈ ప్రాజెక్ట్కి సంబంధించి ఆసక్తికరమైన అప్డేట్ ఒకటి ఫిల్మ్ సర్కిల్స్లో చక్కర్లు కొడుతోంది. ఇండో – పాక్ యుద్ధం నేపథ్యంలో ఈ మూవీ కథ సాగుతుందని, ఇందులో విజయ్ దేవరకొండ సైనికుడిగా కనిపించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాల్ని చిత్ర బృందం త్వరలో ప్రకటించనున్నట్టు తెలిసింది.