నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం `జాతిరత్నాలు`. నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ చిత్రాన్ని అనుదీప్ తెరకెక్కించాడు. ఆద్యంతం నవ్వుల పువ్వులు పూయిస్తున్న ఈ మూవీ ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. లాక్డౌన్ కారణంగా రిలీజ్ ఆలస్యం అవుతూ వచ్చిన ఈ చిత్రం ఎట్టకేలకు మహాశివరాత్రి సందర్భంగా థియేటర్లలోకి వచ్చేసింది.
ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ప్రభాస్ చేత ట్రైలర్ రిలీజ్ చేయించి ఈ చిత్రానికి కావాల్సి నంత పబ్లిసిటీని సొంతం చేసుకున్నారు ఈ మేవీ మేకర్స్. దీంతో ఈ సినిమా పై సహజంగానే అంచనాలు ఏర్పడ్డాయి. మేకింగ్ వరకు ఎలాంటి బజ్ లేని ఈ మూవీ మేకింగ్ తరువాత చేసిన ప్రమోషన్స్ కారణంగా ఈ మూవీ వార్తల్లో నిలిచింది.
ఇదిలా వుంటే ఈ మూవీ కోసం మరో ఇద్దరిని కూడా నాగ్ అశ్విన్ రంగంలోకి దింపేశాడు. ఆ ఇద్దరే కీర్తి సురేష్, విజయ్ దేవరకొండ. వీరిద్దరినీ కూడా ఈ సినిమాకు వాడేశారు. ఈ మూవీ ఫస్ట్ హాఫ్లో కీర్తి సురేష్ కనిపించి అలరించగా, సెకండ్ హాఫ్లో విజయ్ దేవరకొండ తనదైన కామియోతో ఆకట్టుకున్నారు. ఉన్నట్టుండి ఈ సినిమాలో వీరిద్దరిని చూసిన ఆడియన్స్ ఆశ్చర్యపోతున్నారు.