Homeటాప్ స్టోరీస్విజయ్ దేవరకొండ ఆ సినిమాని పక్కన పెట్టాడు

విజయ్ దేవరకొండ ఆ సినిమాని పక్కన పెట్టాడు

Ye Mantram Vesaveపెళ్లి చూపులు , అర్జున్ రెడ్డి చిత్రాల సంచలన విజయాలతో ఒక్కసారిగా విజయ్ దేవరకొండ రేంజ్ మారిపోయింది దాంతో అతడి చిత్రాలకు డిమాండ్ ఏర్పడింది . అయితే పెళ్లి చూపులు , అర్జున్ రెడ్డి చిత్రాల షూటింగ్ ల కంటే ముందే ప్రారంభమైన చిత్రం ” ఏ మంత్రం వేసావే ”. నూతన దర్శకుడు శశిధర్ మర్రి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈరోజు రిలీజ్ అయ్యింది అయితే ఆ సినిమా ప్రమోషన్ లో మాత్రం విజయ్ దేవరకొండ పాల్గొనలేదు దాంతో హీరోకు దర్శకుడి కి మధ్య గొడవలు జరిగాయేమో అన్న గుసగుసలు మొదలయ్యాయి .

ఆ గుసగుసల సంగతి ఎలా ఉన్నప్పటికీ విజయ్ దేవరకొండ రేంజ్ రెండేళ్ల కు ముందు వేరు సంగతి ఇప్పుడు వేరు దాంతో ఈ సినిమాని పట్టించుకోవడం మానేసాడు . దర్శకుడు , మిగతా బృందం సినిమా ని ప్రమోట్ చేయడానికి నానాతంటాలు పడుతున్నారు కానీ అతడు మాత్రం పెద్దగా పట్టించుకున్న పాపాన పోలేదు . ఇక ఈరోజు ఏ మంత్రం వేసావే చిత్రం విడుదల అవుతోంది , ఫలితం మధ్యాహ్నం కల్లా తెలిసి పోనుంది .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All