తెలుగు, తమిళ భాషల్లో హీరోయిన్గా మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు రాధిక. పెళ్లి తరువాత కూడా నటనని కొనసాగిస్తున్నారామె. తాజాగా భర్త శరత్ కుమార్తో కలిసి ఆమె ఓ తమిళ చిత్రంలో నటించారు. వానం `కోట్టాటుమ్` పేరుతో ధన శేఖరన్ రూపొందించిన ఈ చిత్రాన్ని దర్శకుడు మణిరత్నంకు చెందిన మద్రాస్ టాకీస్ నిర్మించింది. సింగర్ సిద్ శ్రీరామ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.
ఇటీవల ఈ చిత్ర ఆడియో రిలీజ్ కార్యక్రమం చెన్నైలోని సత్యం సినిమాస్లో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ నటి రాధిక దర్శకుడు మణిరత్నంపై చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. 1985లో వచ్చిన `పాగల్ నిలవు` చిత్రం కోసం తనని ఎందుకు తీసుకున్నారని. సభాముఖంగా మణిరత్నంని అడగడంతో అంతా అక్కడున్న వారంతా నవ్వేశారు.
మణిరత్నం తాజాగా `పొన్నియిన్ సెల్వన్` చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ఐశ్వర్యారాయ్ కీలక పాత్రలో నటిస్తోంది. ఆ పాత్రలో ముందు తానే నటిస్తానని, మణిరత్నంని అడిగానని, అందుకు ఆయన నీకంటే ఐశ్వర్యారాయ్ టూ ఇంచెస్ హైట్ వుందని చెప్పారని, ఆ కారణంగానే `పొన్నియిన్ సెల్వన్`లో అవకాశాన్ని పోగొట్టుకున్నానని రాధిక చెప్పడంతో ఆడియో సత్యం సినిమాలు నవ్వులతో నిండిపోయింది. ముందు రాధిక మాటలు అర్థం కానీ ఆడియన్స్ ఆ తరువాత తేరుకుని నవ్వుల్లో మునిగిపోయారు.