ఛలో, భీష్మ చిత్రాలతో సూపర్ హిట్స్ అందుకున్నాడు దర్శకుడు వెంకీ కుడుముల. ఈ రెండు సినిమాలు కూడా కామెడీ ప్రధానంగా తెరకెక్కాయి. వెంకీ కామెడీ సెన్స్ కు ప్రేక్షకులతో పాటు సెలబ్రిటీలు కూడా ఫిదా అయ్యారు. వెంకీ మూడో ప్రాజెక్ట్ ఏదై ఉంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే మెగాస్టార్ చిరంజీవితో వెంకీ కుడుముల సినిమా చేయనున్నాడని తెలుస్తోంది. వెంకీ కుడుముల ఆచార్య షూటింగ్ సమయంలోనే చిరంజీవిని కలిసి లైన్ చెప్పాడు.
ఈ మధ్యే ఫుల్ లెంగ్త్ స్క్రిప్ట్ చెప్పి చిరుని ఒప్పించినట్లు తెలుస్తోంది. ఫైనల్ డ్రాఫ్ట్ ను సిద్ధం చేసుకోమని, త్వరలోనే చిత్రాన్ని లాంచ్ చేద్దామని చిరు భరోసా ఇచ్చినట్లు సమాచారం. డివివి దానయ్య ఈ ప్రాజెక్ట్ ను సెట్ చేసినట్లు తెలుస్తోంది. ఆర్ ఆర్ ఆర్ వంటి భారీ ప్రాజెక్ట్ ను నిర్మించిన దానయ్యకు చిరంజీవితో మంచి అనుబంధం ఉంది.
అయితే ఈ ప్రాజెక్ట్ ఇప్పుడప్పుడే సెట్స్ మీదకు వెళ్లేందుకు లేదు. ఎందుకంటే చిరంజీవి మూడు ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నాడు. గాడ్ ఫాదర్ , భోళా శంకర్, బాబీ దర్శకత్వంలో సినిమాలను చిరంజీవి ముందుగా పూర్తి చేయాల్సి ఉంది. వచ్చే ఏడాది చివరికి వెంకీ కుడుముల ప్రాజెక్ట్ కు చిరు డేట్స్ ఇవ్వొచ్చు. ఈలోగా వెంకీ మరో సినిమా చేసుకుంటాడు.
ఇవి కూడా చదవండి:
ఇలా మోసపోయానంటూ వెంకీ కుడుముల వివరణ!
మహేష్ కు కథ వినిపించడానికి సిద్ధమైన వెంకీ కుడుముల
వెంకీ కుడుముల దశ తిరిగిపోయిందిగా!
వెంకీ కుడుములకు బంపర్ ఆఫర్ తగిలినట్టేగా?