గత ఏడాది ప్రారంభంలో `భీష్మ`తో బంపర్ హిట్ని సొంతం చేసుకున్నారు యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుముల. సేంద్రీచ వ్యవసాయం అంటూ ఓ సందేశాన్ని అందిస్తూనే అందమైన ప్రేమకథని తెరపై ఆవిష్కరించారు. దీంతో ఈ మూవీపై ప్రేక్షకులతో పాటు విమర్శకులు కూడా మంచి ప్రయత్నమని ప్రశంసలు కురిపించారు.
అయితే ఈ చిత్రాన్ని జాతీయ అవార్డుల కోసం పంపించండని, దర్శకుడు వెంకీ కుడుములని ఇందు కోసం 60 వేలు ప్రాసెసింగ్ ఫీజ్ కింద వసూలు చేసి అడ్డంగా బుక్ చేశాడో మోసగాడు. ఈ విషయం ఇటీవలే బయటకు వచ్చింది. అయితే తాను ఎలా మోసపోయానో తాజాగా మీడియాకు వివరిస్తూ ఓ లెటర్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు వెంకీ కుడుముల.
ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా తన నంబర్ తెలుసుకుని నవీన్ అనే వ్యక్తి ఫోన్ చేసి జాతీయ అవార్డుల కోసం అప్లై చేయమని తనని అడిగారని. తను చెప్పిన విషయాన్ని నమ్మి తాను తన అసోసియేట్ డైరెక్టర్ ద్వారా తను అడిగిన మొత్తాన్ని అతని అకౌంట్కి ట్రాన్స్ ఫర్ చేశారని, అయితే ఆ తరువాతే తను మోసపోయినట్టు గ్రహించానని వెల్లడించారు.
పోలీసులకు కంప్లైంట్ ఇ్తానంటే తన ఫ్రెండ్స్ వద్దని వారించారని, అయితే తనని మోసం చేసినట్టు మోసగాళ్లు మరొకరిని మోసం చేయకూడదనే తాను పోలీస్ కంప్లైంట్ ఇచ్చానని. ఆ తరువాతే ఈ విషయం బయటికి వచ్చిందని తెలిపారు. సమాజంలో తప్పుడు విషయాలకు వ్యతిరేకంగా గళం విప్పాలని ఈ సందర్భంగా అందరికి విజ్ఞప్తి చేశారు.