తమిళ బ్లాక్ బస్టర్ హిట్ ఫిల్మ్ `అసురన్`. ధనుష్ హీరోగా విభిన్నమైన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని విక్టరీ వెంకటేష్తో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. `నారప్ప` పేరుతో రూపొందుతున్నప ఈ చిత్రాన్ని తమిళ నిర్మాత కలైపులి ఎస్ థానుతో కలిసి సురేష్బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వెంటకేష్ నారప్పగా పక్కా గ్రామీణ యువకుడిగా ఈ చిత్రంలో కనిపించనున్నారు.
ప్రియమణి కీలక పాత్రలో సుందరమ్మగా వెంకటేష్కు జోడీగా నటిస్తోంది. శ్రీకాంత్ అడ్డాల ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రియమణి పాత్ర ఈ చిత్రంలో చాలా కొత్తగా వుండబోతోంది. గత ఏడు నెలలుగా ఆగిపోయిన ఈ మూవీ షూటింగ్ని చిత్ర బృందం ఈ గురువారం హైదరాబాద్లో తిరిగి ప్రారంభించింది. లాక్డౌన్కి ముందే ఈ చిత్రానికి సంబంధించిన కీలక ఘట్టాలని చిత్రీకరించారు. 60 రోజుల పాటు కీలక ఘట్టాల్ని చిత్రీకరించారు.
అనంతపురం జిల్లా ఉరవకొండలోని పాల్తూరులో లాంఛనంగా ప్రారంభమైన ఈ మూవీ షూటింగ్ ఆ తరువాత తమిళనాడు తిరిచందూర్ సమీపంలో వున్న తెరికాడు లోని రెడ్ డెసార్ట్లో కీలక ఘట్టాలని పూర్తి చేశారు. కరోనా వైరస్ కారణంగా నిలిచిపోయిన ఈ మూవీ షూటింగ్ని చిత్ర బృందం తిరిగి హైదరాబాద్లో ప్రారంభించింది. ప్రియమణి, రాజీవ్ కనకాల, రావు రమేష్ తదితరులు పాల్గొనగా కీలక సన్నివేశాలతో పాటు క్లైమాక్స్ని చిత్రీకిరిస్తున్నారు. ఈ షెడ్యూల్తో 80 శాతం చిత్రీకరణ పూర్తి కానుంది. ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాల్ని పూర్తి చేసి చిత్రాన్ని త్వరలో రిలీజ్ చేయనున్నారట.