జీవా, నయనతార జంటగా తమిళంలో రూపొంది విజయం సాధించిన చిత్రాన్ని తెలుగులో ‘వీడే సరైనోడు’ పేరుతో అనువదిస్తున్నారు. నోవా సినిమాస్ పతాకంపై కోకా శిరీష సమర్పణలో జక్కుల నాగేశ్వరావు అందిస్తున్నారు. ఈ చిత్ర ప్రెస్ మీట్ హైదరాబాద్ ఫిలిం ఛాంబర్లో జరిగింది. ఈ కార్యక్రంలో ప్రముఖ నిర్మాతలు టి. ప్రసన్న కుమార్, దామోదర్ ప్రసాద్, మోహన్ వడ్లపట్ల తదితరులు పాల్గొన్నారు.
చిత్ర ఫస్ట్ లుక్, రిలీజ్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 6న విడుదల చేయనున్నారు.
నిర్మాతల మండలి కార్యదర్శి కె.ఎల్. దామోదర ప్రసాద్ మాట్లాడుతూ: చిన్న సినిమాలు ఏడాదికి 150 వరుకు వస్తుంటాయి. అందులో 30 వరకు డబ్బింగ్ సినిమాలో విడుదలవుతుంటాయి. ఈ డబ్బింగ్ సినిమాలు పెద్ద సినిమాలకు పిల్లర్స్ లాగా ఉంటాయి. ఈ సినిమా విజయం సాధించి నిర్మాత నాగేశ్వరరావు గారికి మంచి డబ్బు, పేరు సంపాదించి పెట్టాలని కోరుకుంటున్న.. అన్నారు.
నిర్మాత ప్రసన్న కుమార్ మాట్లాడుతూ: ‘ఈ సినిమాలో మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు మంచి నటులు ఉన్నారు. జీవ నటించిన రంగం సినిమా పెద్ద హిట్ అయింది. అలాగే ఈ సినిమా కూడా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్న అన్నారు.
మరో నిర్మాత మోహన్ వడ్లపట్ల మాట్లాడుతూ: సినిమా విడుదలకు మంచి డేట్ కుదిరింది. నయనతార, జీవ నటన సినిమాకు అదనపు ఆకర్షణ కానుంది. నిర్మాత నాగేశ్వర్ రావ్ గారికి ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెడుతుందని నమ్ముతున్నాను.. అన్నారు.
చిత్ర నిర్మాత నాగేశ్వరరావు మాట్లాడుతూ: ‘ఈ సినిమా కోసం నాకు సహాయ పడిన వారందరికీ ధన్యవాదాలు. ప్రసన్న కుమార్, దామోదర్ ప్రసాద్, మోహన్ వడ్లపట్ల గారు ఈ సినిమాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు, వారికి నా స్పెషల్ థాంక్స్. సెప్టెంబర్ 6న “వీడే సరైనోడు” చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. ఈ సినిమా విజయం సాధిస్తుందని నమ్మకంవుంది. అందుకు అందరి సహకారం కావాలని కోరుకుంటున్నాను.. అన్నారు.
జీవా, నయనతార నటించిన ఈ చిత్రానికి నిర్మాత: జక్కుల నాగేశ్వరరావు, సంగీతం : శ్రీకాంత్ దేవా, సాహిత్యం : వెన్నెలకంటి, చంద్రబోస్, మాటలు : రాజశేఖర్ రెడ్డి, కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఆర్ . ఎస్.రామనాథం.
Press Note By : Indian Clicks, LLC.