మహేష్ హీరోగా నటించిన `మహర్షి` చిత్రంతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు వంశీ పైడిపల్లి. ఈ మూవీ తరువాత మళ్లీ వీరిద్దరి కాంబినేషన్లో ఓ భారీ చిత్రం సెట్స్ పైకి రానుందంటూ వార్తలు షికారు చేశాయి. ఈ ప్రాజెక్ట్ త్వరలోనే పట్టాలెక్కుతుందని `మహర్షి` ప్రమోషన్స్లో హీరో మహేష్ మీడియా ముఖంగా వెల్లడించారు. కానీ ఆ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు.
వంశీ పైడిపల్లి వినిపించిన స్క్రిప్ట్ మహేష్కు నచ్చలేదని, ఆకారణంగానే మహేష్ `సర్కారు వారి పాట`ని ఫైనల్ చేశారని ప్రధానంగా ఇండస్ట్రీ వర్గాల్లో వినిపించింది. దీంతో వంశీ పైడిపల్లి మెగా హీరో రామ్చరణ్తో తన కొత్త ప్రాజెక్ట్ని పట్టాలెక్కించాలని ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టారు. గత ఏడాదే స్క్రిప్ట్ వినిపించారట. రామ్చరణ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని తెలిసింది.
అయితే `ఆర్ ఆర్ ఆర్`తో పాటు `ఆచార్య` చిత్రాల్లో రామ్చరణ్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇవి పూర్తయితే గానీ వంశీ పైడిపల్లికి రామ్చరణ్ డేట్స్ ఇవ్వలేని పరీస్థితి. ఏప్రిల్ వరకు ఈ రెండు చిత్రాలతో చరణ్ ఫుల్ బిజీ మరి ఆ తరువాతైనా వంశీ పైడిపల్లికి డేట్స్ ఇస్తారా? లేదా అన్నదే ప్రస్తుతం సస్పెన్స్గా మారింది.