వైష్ణవ్ తేజ్ హీరోగా క్రిష్ డైరక్షన్ లో వస్తున్న సినిమా కొండపొలం. నవల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈమధ్యనే వచ్చిన సినిమా ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. అక్టోబర్ 8న రిలీజ్ ఫిక్స్ చేసిన ఈ సినిమా నేడు సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ వాళ్లు కొండపొలం సినిమాకు క్లీన్ యు సర్టిఫికెట్ ఇచ్చారు.
ఉప్పెన సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకున్న వైష్ణవ్ తేజ్ తన సెకండ్ సినిమా కూడా ప్రయోగాత్మకంగా చేశాడు. కొండపొలం సినిమా తప్పకుండా మెగా ఫ్యాన్స్ ను మాత్రమే కాదు సినీ ప్రేక్షకులను అలరించేలా ఉంటుందని చెబుతున్నారు. సినిమా కథ, కథనాలు ఆడియెన్స్ ను అలరించేలా క్రిష్ తెరకెక్కించారని తెలుస్తుంది.
ఈ సినిమాతో పాటుగా క్రిష్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో హరి హర వీరమల్లు సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుపుకుంటుంది.