మొదటి సినిమాతోనే సూపర్ పాపులారిటీ సంపాదించుకున్నాడు పంజా వైష్ణవ్ తేజ్. ఉప్పెన సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. మొదటి చిత్రంతోనే బోల్డ్ అటెంప్ట్ తో వైష్ణవ్ తేజ్ అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇక ఉప్పెన విడుదలకు ముందే వైష్ణవ్ తేజ్ తన రెండో చిత్రాన్ని కూడా పూర్తి చేసిన విషయం చాలా మందికి తెలీదు.
దర్శకుడు క్రిష్ తెరకెక్కించిన చిత్రంలో వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్లుగా నటించారు. రికార్డ్ సమయంలో ఈ చిత్రాన్ని పూర్తి చేసారు. అయితే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో జాప్యం కారణంగా ఇన్నాళ్లూ ఈ సినిమా అప్డేట్స్ రాలేదు. అయితే ఇవి చివరి దశకు చేరుకోవడంతో ఫైనల్ గా వాటి గురించి అప్డేట్ వచ్చింది.
ఈ చిత్ర ఫస్ట్ లుక్, టైటిల్ ను ఆగస్ట్ 20న ఉదయం 10 గంటల 15 నిమిషాలకు విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఎంఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ చిత్రం తెరకెక్కింది. కొండపోలేం నవల ఆధారంగా ఈ సినిమాను రూపొందించాడు క్రిష్.
Title & First Look of @FirstFrame_ent #Production8 a spectacular adventurous film of Mega Sensation #PanjaVaisshnavTej, electrifying @Rakulpreet n our masterly team #Sannapureddi @mmkeeravaani @gnanashekarvs is out on Aug 20th, 10:15AM@YRajeevReddy1 #JSaiBabu @MangoMusicLabel pic.twitter.com/0JRlPr6OaQ
— Krish Jagarlamudi (@DirKrish) August 18, 2021