ఉప్పెన సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన పంజా వైష్ణవ్ తేజ్ తన మొదటి సినిమా విడుదల కాకముందే రెండో సినిమాను పూర్తి చేసాడు. క్రిష్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. గతేడాదే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ఎట్టకేలకు విడుదలైంది. కటారు రవీంద్ర యాదవ్ పాత్రలో కనిపిస్తాడు వైష్ణవ్ తేజ్.
ఇక ఈ చిత్రానికి కొండ పొలం టైటిల్ ను కన్ఫర్మ్ చేసారు. అదే పేరుతో గతంలో వచ్చిన నవల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా స్థిరపడిన రవీంద్ర యాదవ్ తన జీవితంలో జరిగిన సంఘటనలను గుర్తుకుతెచ్చుకునే చిత్రంగా ఈ కథ ప్రధాన పాయింట్ నడుస్తుంది.
క్రిష్ సరసన హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ నటించింది. ఎంఎం కీరవాణి సంగీతం అందించిన ఈ సినిమాను అక్టోబర్ 8న విడుదల చేయనున్నారు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాను నిర్మించింది. త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేస్తారు.