గత రెండు నెలలుగా వార్తల్లో నిలుస్తున్న చిత్రం `జాన్`. ప్రభాస్ 20వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా చిత్రీకరణ దశ నుంచే సంచలనంగా మారింది. కరోనా వైరస్ ప్రబలుతున్న వేళ జార్జియా వెళ్లిన ఈ చిత్ర బృందం ప్రతీకూల పరిస్థితుల్లోనూ అక్కడి లొకేషన్లలో కీలక షెడ్యూల్ని పూర్తి చేసుకుని విజయవంతంగా ఇండియా తిరిగి వచ్చింది. యువీ క్రియేషన్స్ బ్యానర్పై రాధాకృష్ణకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ లేదా టైటిల్ అనౌన్స్మెంట్ వస్తుందని ప్రభాస్ ఫ్యాన్స్ గత రెండు నెలలుగా వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. కానీ చిత్ర బృందం మాత్రం మౌనంగా వుంటోంది. ఫ్యాన్స్ ఒత్తిడి మేరకు ఆ మధ్య ట్విట్టర్ వేదికగా స్పందించి త్వరలోనే ఫస్ట్లుక్ని రిలీజ్ చేస్తామని ప్రకటించింది. కానీ చిత్ర బృందం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ రాఏదు.
జూన్ మొదటి వారంలో అయినా ఫస్ట్లుక్, టైటిల్ని రిలీజ్ చేయాలని ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా మేకర్స్ని డిమాండ్ చేస్తున్నారు. 2018 చివరలో సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగితే దానికి సంబంధించిన ఫొటోస్ని చిత్ర బృందం 2020 మేలో ఆ ఫొటోల్ని మీడియాకు రిలీజ్ చేసింది. దీంతో ఫస్ట్లుక్, టైటిల్ ని చిత్ర బృందం ఎప్పుడు రిలీజ్ చేస్తారా అని ప్రభాస్ ఫ్యాన్స్ టెన్షన్తో ఎదురుచూస్తున్నారట. ఈ నెల మొదటి వారంలో అయినా టైటిల్, ఫస్ట్లుక్ పోస్టర్ని రిలీజ్ చేయాల్సిందేనని ప్రభాస్ ఫ్యాన్స్ పట్టుబడుతున్నట్టు తెలిసింది.