Homeగాసిప్స్ప్ర‌భాస్ టీ‌మ్ మౌనం వీడుతోందా?

ప్ర‌భాస్ టీ‌మ్ మౌనం వీడుతోందా?

ప్ర‌భాస్ టీ‌మ్ మౌనం వీడుతోందా?
ప్ర‌భాస్ టీ‌మ్ మౌనం వీడుతోందా?

గ‌త రెండు నెల‌లుగా వార్త‌ల్లో నిలుస్తున్న చిత్రం `జాన్‌`. ప్ర‌భాస్ 20వ చిత్రంగా తెర‌కెక్కుతున్న ఈ సినిమా చిత్రీక‌ర‌ణ ద‌శ నుంచే సంచ‌ల‌నంగా మారింది. క‌రోనా వైర‌స్  ప్ర‌బ‌లుతున్న వేళ జార్జియా వెళ్లిన ఈ చిత్ర బృందం ప్ర‌తీకూల ప‌రిస్థితుల్లోనూ అక్క‌డి లొకేష‌న్‌ల‌లో కీల‌క షెడ్యూల్‌ని పూర్తి చేసుకుని విజ‌య‌వంతంగా ఇండియా తిరిగి వ‌చ్చింది. యువీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై రాధాకృష్ణ‌కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

ఈ మూవీ నుంచి ఫ‌స్ట్ లుక్ లేదా టైటిల్ అనౌన్స్‌మెంట్ వ‌స్తుంద‌ని ప్ర‌భాస్ ఫ్యాన్స్ గ‌త రెండు నెల‌లుగా వేయి క‌ళ్ల‌తో ఎదురుచూస్తున్నారు. కానీ చిత్ర బృందం మాత్రం మౌనంగా వుంటోంది. ఫ్యాన్స్ ఒత్తిడి మేర‌కు ఆ మ‌ధ్య ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించి త్వ‌ర‌లోనే ఫ‌స్ట్‌లుక్‌ని రిలీజ్ చేస్తామ‌ని ప్ర‌క‌టించింది. కానీ చిత్ర బృందం నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి అప్‌డేట్ రాఏదు.

- Advertisement -

జూన్ మొద‌టి వారంలో అయినా ఫ‌స్ట్‌లుక్‌, టైటిల్‌ని రిలీజ్ చేయాల‌ని ప్ర‌భాస్ ఫ్యాన్స్ సోష‌ల్ మీడియా వేదిక‌గా మేక‌ర్స్‌ని డిమాండ్ చేస్తున్నారు. 2018 చివ‌ర‌లో సినిమా ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మం జ‌రిగితే దానికి సంబంధించిన ఫొటోస్‌ని చిత్ర బృందం 2020 మేలో ఆ ఫొటోల్ని మీడియాకు రిలీజ్ చేసింది. దీంతో ఫ‌స్ట్‌లుక్‌, టైటిల్ ని చిత్ర బృందం ఎప్పుడు రిలీజ్ చేస్తారా అని ప్ర‌భాస్ ఫ్యాన్స్ టెన్ష‌న్‌తో ఎదురుచూస్తున్నార‌ట‌. ఈ నెల మొద‌టి వారంలో అయినా టైటిల్‌, ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ని రిలీజ్ చేయాల్సిందేన‌ని ప్ర‌భాస్ ఫ్యాన్స్ ప‌ట్టుబ‌డుతున్న‌ట్టు తెలిసింది.

మ‌రి ప్ర‌భాస్ టీమ్ మౌనం వీడ‌తారా? లేదా అన్న‌ది వేచి చూడాల్సిందే.  ప్ర‌భాస్‌కు త‌ల్లిగా `ప్రేమ పావురాలు ( మైనే ప్యార్ కియా) ఫేమ్ భాగ్య‌శ్రీ న‌టిస్తున్న ఈ చిత్రానికి `జాన్‌, రాధేశ్యామ్ అనే టైటిల్స్‌ని ప‌రిశీలిస్తున్నారు.
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All