`సాహో` తరువాత ప్రభాస్ నటిస్తున్న చిత్రంపై ఆయన ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. `జిల్` ఫేమ్ రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో యువీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ బ్యానర్స్పై సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పిరియాడికల్ లవ్స్టోరీ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తోంది.
కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో చిత్ర బృందం జార్జియాలో కీలక షెడ్యూల్ని పూర్తి చేశారు. తరువా చిత్ర బృందం సేఫ్గా హైదరాబాద్ చేరుకుంది. ఇక్కడే తదుపరి షెడ్యూల్ ని ప్రారంభించాలని ప్లాన్ చేశారు. కానీ కరోనా కారణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ విధించడంతో షూటింగ్లన్నీ బంద్ అయిపోయాయి. దీంతో ప్రభాస్ సినిమా షూటింగ్ని కూడా నిరవధికంగా వాయిదా వేశారు.
అయితే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ మాత్రం ఇంత వరకు మేకర్స్ రిలీజ్ చేయలేదు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ గత కొన్ని రోజులుగా అసహనంతో వున్నారు. దీన్ని గమనించిన మేకర్స్ త్వరలోనే ఫస్ట్లుక్ని రిలీజ్ చేస్తామంటూ ప్రకటించింది. ఈ నెల కూడా లాక్డౌన్ విధించడంతో వచ్చే నెలలో ఫస్ట్లుక్తో పాటు ఈ చిత్ర టైటిల్ని ప్రకటించాలని చిత్ర బృందం ప్లాన్లో వుందని తెలిసింది.