Homeటాప్ స్టోరీస్మామ‌య్య ఆరోగ్యంపై క్లార‌టీ ఇచ్చాడు!

మామ‌య్య ఆరోగ్యంపై క్లార‌టీ ఇచ్చాడు!

మామ‌య్య ఆరోగ్యంపై క్లార‌టీ ఇచ్చాడు!
మామ‌య్య ఆరోగ్యంపై క్లార‌టీ ఇచ్చాడు!

ప్ర‌ముఖ గేయ ర‌చ‌యిత, జాతీయ అవార్డు గ్ర‌హీత సుద్దాల అశోక్‌తేజ అస్వ‌స్థ‌కు గుర‌య్యార‌ని, ఆయ‌న గ‌త కొంత కాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధ‌ప‌డుతున్నార‌ని, త్వ‌ర‌లోనే  గ‌చ్చిబౌలిలోని ఏషియ‌న్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట‌రాజీలో ఆయ‌న‌కు కాలెయానికి సంబంధించిన ఆప‌రేష‌న్ జ‌ర‌గ‌నుంద‌ని సోష‌ల్ మీడియాలో ప‌లు వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్న విష‌యం తెలిసిందే. అయితే ఇందులో నిజ‌మెంత? అని చాలా మంది చాలా ర‌కాలుగా అనుమానాలు వ్య‌క్తం చేశారు.

ఈ వార్త‌ల‌పై సుద్దాల అశోక్‌తేజ మేన‌ల్లుడు, న‌టుడు ఉత్తేజ్ స్పందించారు. `మా మామ‌య్య సుద్దాల అశోక్‌తేజ అనారోగ్యంగా వున్నారంటూ సోష‌ల్ మీడియాలో వ‌స్తున్న వార్త‌లు నిజ‌మే. చికిత్స కోసం ఆయ‌న ఈరోజు ఆసుప‌త్రిలో చేర‌నున్నారు. రేపు సాయంత్రం చికిత్స జ‌ర‌గ‌నుంది. స‌ర్జ‌రీ స‌మ‌యంలో ర‌క్తం అవ‌స‌రం అవుతుందేమోన‌ని మామ‌య్య త‌న స్నేహితుడితో చెప్పారు. ఈ విష‌యాన్ని ఆ స్నేహితుడు ఫేస్ బుక్‌లో పోస్ట్ చేయ‌డంతో ర‌క‌ర‌కాల వార్త‌లు వ‌స్తున్నాయి`అన్నారు.

- Advertisement -

ర‌క్తం అవ‌స‌రం వున్న మాట వాస్త‌వ‌మే. ఆ విష‌యంపై నేను చిరంజీవి బ్ల‌డ్ బ్యాంక్‌కు కాల్ చేశాను వాళ్లు స్పందించి ర‌క్త దాత‌ల్ని పంపిస్తామ‌న్నారు. ఈ విష‌యం తెలిసి చిరంజీవి మామ‌య్య‌తో మాట్లాడి ధైర్యం చెప్పారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All