మేగా మేనల్లుడు సాయిధరమ్తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న చిత్రం `ఉప్పెన`. బుచ్చిబాబు సాన దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. కృతిశెట్టి కథానాయికగా పరిచయం అవుతోంది. మైత్రీ మూవీమేకర్స్తో కలిసి దర్శకుడు సుకుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఏప్రిల్లోనే ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేసింది. కానీ లాక్డౌన్ కారణంగా థియేటర్లు మూసివేయడంతో రిలీజ్ని వాయిదా వేశారు.
కరోనా ప్రబలడంతో థియేటర్లు ఇప్పట్లో ఓపెన్ చేయడం కష్టమనే మాటలు వినిపిస్తున్నాయి. దీంతో చిత్ర బృందం ఈ చిత్రాన్ని థియేటర్లో కాకుండా ఓటీటీలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వినిపించాయి. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, మా చిత్రాన్ని థియేటర్లలోనే రిలీజ్ చేస్తామంటూ క్లారిటీ ఇచ్చారు. తాజాగా ఈ చిత్ర రన్టైమ్, ఫైనల్ ఎడిటింగ్పై వార్తలు వినిపించడం మొదలైంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర ఫైనల్ ఎడిట్ పూర్తయిందని, ఫైనల్ కట్ని ఫినిష్ చేసి రన్ టైమ్ని 2గంటల 30 నిమిషాలకు లాక్ చేసినట్టు తెలిసింది.
థియేటర్ల రీఓపెన్ కోసం మేకర్స్ ఎదురుచూస్తున్నారు. ఎప్పుడు మొదలైతే అప్పుడు సినిమాని రిలీజ్ చేయాలని సర్వం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన `నీ కళ్లు నీలి సముద్రం.., ఊపిరి మొత్తం ఉప్పెనైతే.. ` అంటూ సాగే పాటలు యూట్యూబ్లో వైరల్గా మారాయి.