సాయిధరమ్తేజ్ సోదరుడు వైష్ణవ్తేజ్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం `ఉప్పెన`. కృతి శెట్టి హీరోయిన్గా నటిస్తోంది. మైత్రీ మూవీమేకర్స్తో కలిసి దర్శకుడు సుకుమార్ సుకుమార్ రైటింగ్స్ బ్యానర్పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బుచ్చిబాబు సానా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మత్సకారుల జీవితాల్లోని కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తూనే ఓ సరికొత్త ప్రేమకథని ఈ చిత్రంలో చూపించబోతున్నారు.
దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం కోసం శ్రీమణి రాసిన `నీ కన్నునీలి సంద్రం..` అంటూ సాగే గీతాన్ని సోమవారం సాయంత్రం స్టార్ డైరెక్టర్ కొరటాల శివ రిలీజ్ చేశారు. జావేద్ అలీ ఈ పాటని పాడారు. ఈ వేసవికి ఇంత కంటే చల్లనైన సినిమా రాదనేది నా ప్రగాఢ విశ్వాసం. దర్శకుడు బుచ్చిబాబు ఈ కథ ఫస్టాఫ్ ఒకసారి సెకండ్ హాఫ్ ఒకసారి చెప్పాడు. అతను చెప్పిన విధానం చూసి సినిమా ఎలా వుండబోతుందో ముందే ఊహించాను. తనకు తెలిసి ఇంత చక్కని విలేజ్ లవ్స్టోరీ ఈ మధ్య కాలంలో రాలేదు. తనని బాగా స్ఫూర్తినిచ్చిన సినిమా `సతాకోక చిలుక`. మళ్లీ ఇన్నాళ్లకు అలాంటి ఫీల్ వున్న సినిమా ఇది అని దర్శకుడు కొరటాల శివ స్పష్టం చేశారు.
వైష్టవ్ తేజ్కు ఇంతకంటే డెబ్యూ మూవీ రాదనుకుంటున్నా అన్నారు. తమిళ క్రేజీ హీరో విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 2న వరల్డ్ వైడ్గా రిలీజ్ చేస్తున్నారు. ఇటీవలే విజయ్ సేతుపతికి సంబంధించిన ఫస్ట్లుక్ని రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. `మా భూమి` సాయిచంద్, బ్రహ్మాజీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.